BigTV English
Advertisement

Venkaiah Naidu : ‘పద్మ విభూషణ్ ‘.. నా బాధ్యతను మరింత పెంచింది..

Venkaiah Naidu : ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు కలిపాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Venkaiah Naidu : ‘పద్మ విభూషణ్ ‘.. నా బాధ్యతను మరింత పెంచింది..

Venkaiah Naidu : ఆత్మనిర్భర్‌ భారత్‌గా దేశం అడుగులు ముందుకేస్తోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆ లక్ష్యం సంపూర్ణంగా నెరవేరాలంటే ప్రతి ఒక్కరూ రాజకీయాలు, వివాదాలను పక్కనపెట్టి ప్రభుత్వంతో చేతులు కలిపాలన్నారు. దేశ భవిష్యత్తు కోసం సమైక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.


ప్రపంచం మరోసారి భారత్‌ వైపు చూస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. అందరూ ఐక్యంగా ముందుకు సాగి దేశాన్ని శక్తిమంతంగా తయారు చేసేందుకు పాటుపడాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో ముందుకుపోతోందన్నారు. తనకు ‘పద్మవిభూషణ్’ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

దేశంలోని రైతులు, మహిళలు, యువత, నాతోటి పౌరులందరికీ ఈ పురస్కారాన్ని అంకితం చేస్తున్నానని వెంకయ్యనాయుడు తెలిపారు. భారతదేశ కీర్తిని శిఖరాగ్రాలకు చేర్చేందుకు అందరం క‌ృషి చేద్దామని పిలుపునిచ్చారు. మాతృభూమి సేవకు పునరంకితం అవుదామన్నారు. తనతోపాటు పద్మవిభూషన్ పురష్కారానికి ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. తన నటనా మటిమతో విశేష సంఖ్యలో అభిమానుల్ని సంపాదించుకొని చలన చిత్ర రంగానికి బహుముఖ సేవు అందించారని చిరంజీవిని ప్రశంసించారు.


Tags

Related News

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

ACB Raids: ఏపీ వ్యాప్తంగా ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు

Tirumala News: శ్రీవారి పరకామణి చోరీ కేసు.. CID విచారణ మొదలు, రేపో మాపో వైసీపీ నేతలు కూడా?

Big Stories

×