E-Paper
Advertisement

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ

Vijayawada court: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పై రాయి విసిరిన కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్‌కు కోర్టు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

సీఎం జగన్ పై రాయి వేసింది సతీష్ కుమార్ అంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సింగ్ నగర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిందితుడు సతీష్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. బాధితుడు సీఎం అయినందున సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Also Read: మహిళలూ జాగ్రత్త, జగన్ వస్తే ఆస్తులకు శఠగోపం

అయితే నిందితుడు సతీష్ ను అతని తరఫు న్యాయవాది, తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో నిందితుడు సతీష్ గురువారం నుంచి శనివారం వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×