BigTV English

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ

Vijayawada court: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పై రాయి విసిరిన కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్‌కు కోర్టు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.


సీఎం జగన్ పై రాయి వేసింది సతీష్ కుమార్ అంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సింగ్ నగర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిందితుడు సతీష్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. బాధితుడు సీఎం అయినందున సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


Also Read: మహిళలూ జాగ్రత్త, జగన్ వస్తే ఆస్తులకు శఠగోపం

అయితే నిందితుడు సతీష్ ను అతని తరఫు న్యాయవాది, తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో నిందితుడు సతీష్ గురువారం నుంచి శనివారం వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు.

Tags

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×