E-Paper
Advertisement

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ

CM Jagan: సీఎం జగన్‌పై రాయి దాడి కేసు.. నిందితుడికి 3 రోజుల కస్టడీ
Advertisement

Vijayawada court: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ పై రాయి విసిరిన కేసులో ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్‌కు కోర్టు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

సీఎం జగన్ పై రాయి వేసింది సతీష్ కుమార్ అంటూ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ కుట్రకోణంలో ఎవరెవరు ఉన్నారనే దానిపై మరింతగా విచారించాల్సిన అవసరం ఉందంటూ పోలీసులు విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Advertisement

సింగ్ నగర్ పోలీసులు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ నిందితుడు సతీష్ ను 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కోరారు. బాధితుడు సీఎం అయినందున సతీష్ ను 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ న్యాయాధికారి రమణారెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Also Read: మహిళలూ జాగ్రత్త, జగన్ వస్తే ఆస్తులకు శఠగోపం

Advertisement

అయితే నిందితుడు సతీష్ ను అతని తరఫు న్యాయవాది, తల్లిదండ్రుల సమక్షంలో మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంతో నిందితుడు సతీష్ గురువారం నుంచి శనివారం వరకు పోలీసుల కస్టడీలో ఉండనున్నాడు.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×