E-Paper
Advertisement

Janasena Party: విజయవాడ జనసేన మీటింగ్‌లో రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న నేతలు.. మీడియాపై దాడి..!

Janasena Party: విజయవాడ జనసేన మీటింగ్‌లో రచ్చ.. ఒకరినొకరు కొట్టుకున్న నేతలు.. మీడియాపై దాడి..!
Advertisement

Janasena Party: విజయవాడలో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాలూరి సమక్షంలోనే సొంత పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడటం గమనార్హం.

విజయవాడలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జనసేన వీరమహిళ, పార్టీ నేత రావి సౌజన్య మాట్లాడుతూ.. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడుతున్నా తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని రామ్ తాలూరి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆమె మాట్లాడుతున్న సమయంలోనే ఇతర నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆమెపై ఎదురుదాడికి దిగారు. సౌజన్య పార్టీ ముసుగులో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనితో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మొదలై, తోపులాటకు దారితీసింది.

Advertisement

నేతల మధ్య గొడవను వీడియో తీస్తున్న బిగ్ టీవీ (Big TV) కెమెరామన్‌పై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. కెమెరాను లాక్కొని, వీడియోలు తీయవద్దంటూ దుర్భాషలాడారు. తోటి మీడియా మిత్రులందరూ దీనిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే జోక్యం చేసుకున్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామాన్య ఉదయభాను, దాడికి పాల్పడిన నేతలతో మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన గైడ్ లైన్స్ జారీ చేస్తామని హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.

కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని, పార్టీలో తమకు తగిన గుర్తింపు లభించడం లేదని పలువురు కార్యకర్తలు ఈ సందర్భంగా నేతల ముందు మొరపెట్టుకున్నారు.

Advertisement

Read Also: Addanki Counter: వేడెక్కిన ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ వ్యాఖ్యలు, అసలు గుట్టు బయటపెట్టిన అద్దంకి

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×