BigTV English
Advertisement

Election Code Rules: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?

Election Code Rules: ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?
Election Code
Election Code

Election Code Rules: ఆ… ఆగడాగండి…
ఈ విషయం చెప్పే ముందు ఒక ఉదాహరణ చెబుతాను.
మీకు అర్జంటుగా ఒక అవసరం వచ్చింది.
ఒక రూ.50 వేలు కావాలి…
వెంటనే ఫ్రెండు, కజిన్ ఎవరినో అడిగారు..
లేదా ఇంట్రస్ట్ కి ఒకరి దగ్గర తీసుకుందామని అనుకున్నారు.
వాళ్లు క్యాష్ ఇచ్చారు…
మీరు ఎంచక్కా డబ్బులు జేబులో పెట్టుకుని
బైక్ మీద విజిల్ వేసుకుంటూ వెళుతున్నారు.


దారిలో పోలీసులు ఆపారు.
బండి లైసెన్స్ అని మీరనుకున్నారు.
కానీ వాళ్లు మీ జేబులో ఉన్న డబ్బులు ఎక్కడివి?
అని అడిగారు…
ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానని అన్నారు…
ఎవరా ఫ్రెండు? ఆధారం ఏది? అన్నారు…
మీ దగ్గర ఆన్సర్ లేదు…
పోలీసులకి డౌట్ వచ్చింది.
ఎందుకంటే ఆ డబ్బులేమైనా పొలిటికల్ లీడర్స్ దగ్గర నుంచి తెచ్చేస్తున్నావేమోనని అనుమాన పడ్డారు.
మీ ఫ్రెండు పేరేమిటి? అని అడిగారు…
మీ గుండెలు జారిపోయాయి..
వాడి పేరు చెప్పాలి…
వాడికెక్కడి నుంచి వచ్చాయో వాడు చెప్పాలి.
మొత్తం నీ వివరాలు, నీకు డబ్బులిచ్చిన పాపానికి వారి వివరాలు… మొత్తం పుట్టంతా కదిపేసి వదిలేస్తారు.

Also Read: Rahul Gandhi Bharat Jodo Yatra: ముగిసిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. నేడు భారీ బహిరంగ సభ!


ఇదంతా ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
మీ వద్ద రూ.50 వేలకు మించి ఉంటే, మీరు ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది.

ఒకవేళ బ్యాంకుల నుంచి డ్రా చేసి తీసేటప్పుడు కూడా ఆ రిసీప్ట్ లు అవీ జాగ్రత్తగా పెట్టుకోండి. పెళ్లిళ్లు, పుట్టినరోజులు, ఫంక్షన్లు చేసుకుంటే ముందుగానే ఎస్పీ ఆఫీసులో లెటర్ ఇచ్చి, పర్మిషన్ తెచ్చుకోవాలి. ఆసుపత్రిల్లో రోగులు ఉంటే, వారికి చెందిన ఓపీ బిల్లులు దగ్గర పెట్టుకోవాలి. అప్పుడే డబ్బులు జేబులో పెట్టుకు తిరగాలి.

ఇదంతా ఎందుకంటే రాజకీయ పార్టీలు అప్పుడే డబ్బులను సంచుల్లో కుక్కి రాష్ట్రాలు, నగరాలు, పట్టణాలు, పల్లెలు దాటించేస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఆపడానికి అందరూ శత విధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు క్యాష్ తో వెళ్లడం రిస్క్. అందుకే కోరి రిస్క్ తెచ్చుకోవద్దని పోలీసులు కోరుతున్నారు.

Also Read: Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

ఇలా దొరికిన సొమ్మును జిల్లాస్థాయిలో ఉండే కమిటీకి అప్పగిస్తారు. జిల్లా పరిషత్ సీఈవో ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారు. వారెదురుగా నిలబడి, గంటలు గంటలు ఎదురుచూసి, వారు అడిగే లక్షా తొంభై ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.
ఆధారాలన్నీ ఉంటేనే, నగదు, డబ్బులు తిరిగిస్తారు. లేదంటే కృష్ణార్పణం అని వదిలేసుకోవాలి.

Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×