E-Paper
Advertisement

APSRTC Bus: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు

APSRTC Bus: కర్చీఫ్ వేసిన సీట్లో కూర్చుంటావా? పురుషుడిని జుట్టుపట్టుకుని చితక్కొట్టిన మహిళలు
Advertisement

APSRTC Bus: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు తర్వాత, ఆర్టీసీ బస్సుల్లో సీటు గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిపై మహిళలు దాడి చేశారు. ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని మరి కొట్టారు. తాము కర్చీఫ్ వేసిన సీటులో ఎలా కూర్చుంటావా అంటూ తోటి ప్రయాణికుడితో మహిళలు ఘర్షణకు దిగారు. కాకినాడ జిల్లా తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ఘటన చోటుచేసుకుంది.

బస్సు రద్దీగా ఉండటంతో ఇద్దరు మహిళలు తమ కర్చీఫ్‌లు ఒక సీటుపై వేసుకున్నారు. ఇది బస్సుల్లో సాధారణంగా చూసే అసాధారణ ‘సీటు బుకింగ్’ పద్ధతి. అయితే కొంతసేపటి తర్వాత, ఓ వ్యక్తి ఆ సీటులో కూర్చున్నాడు. దీంతో మహిళలు కోపంతో అతనితో వాగ్వాదానికి దిగారు. “మేము కర్చీఫ్ వేసిన సీటులో ఎలా కూర్చుంటావు?” అని ప్రశ్నించారు. అది కాస్తా చిలికి చిలికి గాలివానలా మారింది.

Advertisement

వాగ్వాదం మరింత పెరిగిన తర్వాత, మహిళల్లో ఒకరు ప్రయాణికుడి జుట్టు పట్టుకుని గట్టిగా కొట్టడం మొదలెట్టారు. మరో మహిళ కూడా చేరి, అతనిపై దాడి చేసింది. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు మొబైల్‌తో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం X లో వైరల్ అవుతుంది.

Also Read: వైజాగ్‌కు కొత్త కిరీటం: 300 రూపాయల టికెట్‌తో ఆకాశంలో నడిచే అనుభూతిని అందించనున్న స్కై వాక్ బ్రిడ్జ్

Advertisement

అయితే ఈ వీడియో పై రియాక్ట్ అయ్యి చాలా మంది ప్రజలు ఈ ఫ్రీ బస్సు పథకం వల్ల సీటు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. అంతేకాకుండా బస్సులో పురుషులకు, మహిళలకు సమాన హక్కు ఉండాలి. మొత్తం వారే సీట్లు ఆక్రమిస్తున్నారు. మేము డబ్బులు కట్టి కూడా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందని పురుషులు విమర్శిస్తున్నారు. దీనిపై అందరికి సమ న్యాయం కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×