E-Paper
Advertisement

Nagarjuna Yadav Arrested: చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

Nagarjuna Yadav Arrested: చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Advertisement

నాగార్జున యాదవ్ ఈ మధ్యకాలంలో ఓ ఛానల్ డిబెట్ లో మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో చంద్రబాబు నాయుడితో పాటు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురిపించారు.  అలిపిరి వద్ద బాంబుబ్లాస్ట్ సంగటన నుంచి తప్పించుకున్న చంద్రబాబు ఈ సారి మాత్రం తప్పించుకోలేరు.. అతన్ని అంతమొందిస్తాము అంటూ తీవ్ర స్థాయితో మాట్లాడారు. అదేవిధంగా తెలంగాణ సీఎంను డెలవరీబాయ్ లాంటి వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంలో ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లో నాగార్జున యాదవ్ పై అటు తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కేసులు నమోదు చేశారు.

Advertisement

అయితే గత కొంత కాలంగా చంద్రబాబును, రేవంత్ రెడ్డిని తీవ్ర పదజాలంతో మాట్లాడిన నాగార్జున యాదవ్ గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నాడు. అయితే తాజాగా అతను బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్న చిత్తూరు జిల్లా పోలీసులు కుప్పం తీసుకువచ్చి విచారిస్తున్న నేపథ్యంలో.. ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణా పోలీసులు కూడా అతన్ని తమ అదుపులో తీసుకురావడానికి పీటీ వారంటర్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే నాగార్జున యాదవ్ అరెస్ట్ కు సంబంధించి పోలీసులు అధికారంగా ప్రకటించలేదు.

కొంత సమాచారం మేరకు ఆదివారం రాత్రి అతన్ని కుప్పం తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద అతనిపై గతంలో ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యాయో విచారించనున్నారు. అధేవిధంగా ఈ కేసుకి సంబంధించి చిత్తూరులో తెలుగు యువత అధికార ప్రతినిధి వరుణ్ ఫిర్యాదు చేశారు. దీంతో అతను మాట్లాడిన వీడియోలను కూడా పోలీసులకు ఇచ్చిన నేపథ్యంలో నాగార్జున యాదవ్ సాక్ష్యాధాలతో ఈ కేసులో బుక్కైన పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో తెలంగాణ పోలీసులు కూడా ఈ కేసుపై విచారిస్తున్నారు.

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×