E-Paper
Advertisement

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

YS Jagan: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో బయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చెడు సాంప్రదాయానికి సీఎం నాంది పలికారని తెలిపారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే టీడీపీ చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని సూచించారు.

దాడులు ఆపకపోతే అవే వాళ్లకు తిప్పికొడతాయని గుర్తించాలన్నారు. వైసీపీకి ఓటు వేసినందుకు 20 ఏళ్ల యువకుడిన దారుణంగా కొట్టారని అన్నారు. వైసీపీ నేత అజయ్‌పై దాడి చేయడం దారుణం అని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని చెప్పారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని అన్నారు. అధికారం మారిన రోజు ఆ పాపాలే తనకు చుట్టుకుంటాయని గుర్తించాలన్నారు.

ఈ సంస్కృతి ఆపేయాలని చంద్రబాబును మరో సారి హెచ్చరిస్తున్నా.. ఇది సరైన పద్దతి కాదు అని చెప్పారు. వైసీపీపై దాడులు ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్లే పది శాతం ఓట్లు కూటమికి పడ్డాయని అన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు, వైసీపీ దాడులపై కాకుండా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకు హితవు పలికారు.

Tags

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×