E-Paper
Advertisement

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్
Advertisement

YS Jagan: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో బయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చెడు సాంప్రదాయానికి సీఎం నాంది పలికారని తెలిపారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే టీడీపీ చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని సూచించారు.

దాడులు ఆపకపోతే అవే వాళ్లకు తిప్పికొడతాయని గుర్తించాలన్నారు. వైసీపీకి ఓటు వేసినందుకు 20 ఏళ్ల యువకుడిన దారుణంగా కొట్టారని అన్నారు. వైసీపీ నేత అజయ్‌పై దాడి చేయడం దారుణం అని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని చెప్పారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని అన్నారు. అధికారం మారిన రోజు ఆ పాపాలే తనకు చుట్టుకుంటాయని గుర్తించాలన్నారు.

Advertisement

ఈ సంస్కృతి ఆపేయాలని చంద్రబాబును మరో సారి హెచ్చరిస్తున్నా.. ఇది సరైన పద్దతి కాదు అని చెప్పారు. వైసీపీపై దాడులు ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్లే పది శాతం ఓట్లు కూటమికి పడ్డాయని అన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు, వైసీపీ దాడులపై కాకుండా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకు హితవు పలికారు.

Tags

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×