BigTV English
Advertisement

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

YS Jagan: చంద్రబాబును మరోసారి హెచ్చరిస్తున్నా.. : జగన్

YS Jagan: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో బయానక వాతావరణం సృష్టిస్తున్నారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చెడు సాంప్రదాయానికి సీఎం నాంది పలికారని తెలిపారు. టీడీపీ శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే టీడీపీ చేస్తున్న దాడులను వెంటనే ఆపేయాలని సూచించారు.


దాడులు ఆపకపోతే అవే వాళ్లకు తిప్పికొడతాయని గుర్తించాలన్నారు. వైసీపీకి ఓటు వేసినందుకు 20 ఏళ్ల యువకుడిన దారుణంగా కొట్టారని అన్నారు. వైసీపీ నేత అజయ్‌పై దాడి చేయడం దారుణం అని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని చెప్పారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా చంద్రబాబు పాపాలు పండుతున్నాయని అన్నారు. అధికారం మారిన రోజు ఆ పాపాలే తనకు చుట్టుకుంటాయని గుర్తించాలన్నారు.

ఈ సంస్కృతి ఆపేయాలని చంద్రబాబును మరో సారి హెచ్చరిస్తున్నా.. ఇది సరైన పద్దతి కాదు అని చెప్పారు. వైసీపీపై దాడులు ఆపకపోతే న్యాయపోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాల వల్లే పది శాతం ఓట్లు కూటమికి పడ్డాయని అన్నారు. రైతు భరోసా, నిరుద్యోగ భృతి, అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీలు ఎమయ్యాయని ప్రశ్నించారు. చంద్రబాబు, వైసీపీ దాడులపై కాకుండా ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని అన్నారు. దాడుల సంస్కృతిని ప్రోత్సహించే పరిస్థితి రాకూడదని చంద్రబాబుకు హితవు పలికారు.


Tags

Related News

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

AP Govt Three Wheelers Scheme: దివ్యాంగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా మూడు చక్రాల వాహనాలు.. దరఖాస్తు వివరాలు ఇలా

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Big Stories

×