BigTV English

YS Sharmila on Ys Bharati: వివేకా హత్య కేసులో భారతి రెడ్డి పాత్ర..? సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

YS Sharmila on Ys Bharati: వివేకా హత్య కేసులో భారతి రెడ్డి పాత్ర..? సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల

YS Sharmila Comment on CM Jagan wife Bharati: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కొత్త విషయాలు  వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా హత్య జరిగిన రోజున పులివెందుల అంతఃపురంలో మిడ్ నైట్ ఏం జరిగిందనేది సూటిగా చెప్పేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. ఇప్పటివరకు ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీఎం జగన్ తప్పించారని ఆరోపణలు వచ్చాయి. కానీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్ చేశారు.


సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ రెండు ‘బీ’ల చేతిలో ఉందన్నారు వైఎస్ షర్మిల. ఒక బీ బీజేపీ అయితే మరో బీ స్వయాన ఆయన సతీమణి అని అన్నారు. చెల్లెలు కంటేనే సీఎం జగన్‌కు భార్య తరఫు బంధువులు ఎక్కువయ్యారని అన్నారు. అందుకే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని తప్పించాలని చూస్తున్నారన్నారు. వివేకా హత్య కేసు జరిగిన రోజు తెల్లవారుజామున తొలి ఫోన్ వైఎస్ భారతికి వెళ్లినప్పుడు భాహ్యప్రపంచానికి ఎందుకు తెలియజేలేదని ప్రశ్నించారు. అలా చెప్పుంటే కడిగిన ముత్యంలా బయటకు వచ్చేవారు కదా అని చెప్పారు వైఎస్ షర్మిల.

Also Read: Fighting between Ysrcp vs Tdp cadre: కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు, ఏం జరుగుతుందోనని..


వివేకానంద హత్యను గుండెపోటు అని ఎందుకు చెప్పారు అని ప్రశ్నించారు వైఎస్ షర్మిల. దాచిపెట్టాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ ఎందుకు వద్దంటున్నారని అన్నారు. ఫోన్ కాల్ పొద్దున్న ఏ సమయానికి వచ్చిందో చెప్పండంటూ వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం గుప్పించారు. సీఎం జగన్ ఎందుకు డిఫెన్స్‌లో ఉన్నారన్నారు.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×