BigTV English
Advertisement

Sharmila, Sunitha shocking comment: జగన్‌పై ఆగ్రహం, గొడ్డలితో నరికి చంపినప్పుడు..!

Sharmila, Sunitha shocking comment: జగన్‌పై ఆగ్రహం, గొడ్డలితో నరికి చంపినప్పుడు..!

Sharmila, Sunitha shocking comment: ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. జగన్ ప్రభుత్వంలోని లోపాలు ఎత్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేనివారు.. ఇక ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆయన చెల్లెళ్లు వైఎస్ షర్మిల, సునీత.


శుక్రవారం పులివెందులలో రోడ్ షో నిర్వహించారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ షర్మిల… వివేకానంద హత్య జరిగి ఐదేళ్లు గడుస్తోందన్నారు. ఇప్పటివరకు ఆయన ఫ్యామిలీకి ఎలాంటి న్యాయం చేయలేదని తూర్పారబట్టారు. వివేకాను గొడ్డలితో నరికి నరికి చంపినప్పుడు ఆయన ఎంత నరకం అనుభవించారోనని కంటతడి పెట్టారు. సీబీఐ విచారణలో ఎంపీ అవినాష్‌రెడ్డి దోషి, నిందితుడిగా తేల్చిందన్నారు. గూగుల్ టేకవుట్, ఫోన్‌కాల్స్ రికార్డులు, డబ్బు లావాదేవీలు జరిగినట్టు అన్నిరకాల సాక్షాలను సీబీఐ బయటపెట్టిందని గుర్తు చేశారు షర్మిల.

వైఎస్ఆర్ తమ్ముడికి ముమ్మాటికీ న్యాయం జరగలేదన్నారు వైఎష్ షర్మిల. తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని సీఎం జగన్ హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి హంతకులకు ఓటు వేయాలా లేదో అన్నది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఒకవైపు వైఎస్ బిడ్డ.. మరోవైపు హంతకుడు.. న్యాయం కోసం పోరాటం చేస్తున్న తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి అవినాష్‌కు శిక్ష పడకుండా కాపాడారంటూ దుయ్యబట్టారు.


అంతకుముందు సునీత మాట్లాడుతూ రాముడికి లక్ష్మణుడు ఎలాగో… వైఎస్‌కు వివేకా అలాంటివారని, అలాంటి వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశారని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని, కరవు సీమకు నీళ్లు తేవడానికి ఏం కృషి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు వేసే ముందు సరైన వ్యక్తిని ఎన్నుకోవాలని, ధర్మ వైపు ఉండాలంటే వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

Related News

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Big Stories

×