BigTV English

Crimes in Telangana : తెలంగాణలో దారుణాలు.. తండ్రిని చంపిన కొడుకు, దంపతుల ఆత్మహత్య

Crimes in Telangana : తెలంగాణలో దారుణాలు.. తండ్రిని చంపిన కొడుకు, దంపతుల ఆత్మహత్య

Crimes in Telangana : తెలంగాణలోని వేర్వేరు ప్రాంతాల్లో దారుణ ఘటనలు వెలుగు చూశాయి. నెలరోజుల క్రితం ఇద్దరు పిల్లల్నీ హతమార్చిన దంపతులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెంకు చెందిన పి. అనిల్ (26), దేవి (22) మార్చి 10న తమ ఇద్దరు కుమార్తెలను హతమార్చారు. కుమార్తెలు లోహిత (2), జస్విత (1) లకు పాలల్లో విషం కలిపి చంపారన్న ఆరోపణలున్నాయి.


Also Read : డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు దుర్మరణం

నాటి నుంచీ పరారీలో ఉన్న దంపతులు.. తాజాగా గ్రామానికి సమీపంలోని అడవిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరారీలో ఉన్న అనిల్, దేవిల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శుక్రవారం (ఏప్రిల్ 12) ఉదయం అడవిలో మృతదేహాలు లభ్యమయ్యాయి.


మరోవైపు మంచిర్యాలలోని రామకృష్ణాపూర్ లో దారుణ ఘటన జరిగింది. సెల్ ఫోన్ విషయంలో తండ్రి, కుమారుడి మధ్య ఘర్షణ జరగగా.. ఆవేశంతో కొడుకు రాకేశ్ తండ్రిపై దాడి చేశాడు. రాయమల్లు తలపై రోకలిబండతో కొట్టడంతో ఆయన మరణించారు. రాయమల్లు (62) సింగరేణి విశ్రాంత కార్మికుడు.

Tags

Related News

IPS Puran Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య దారుణం.. ఛండీగడ్‌లో డిప్యూటీ సీఎం భట్టి

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. భర్తను తలచుకుని స్టేజ్ పైనే ఏడ్చేసిన మాగంటి సునీత

Heavy Rains: తెలంగాణకు భారీ వర్షం సూచన.. ఆ ప్రాంతాల్లో ఉరుములతో, దీపావళికి ముసురు?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. మొదలైన నామినేషన్ల ప్రక్రియ, గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే

Hyderabad Water Cut: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. నగరంలో రెండు రోజులు తాగునీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Big Stories

×