E-Paper
Advertisement

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం.. ఎక్స్ వేదికగా విమర్శలు

YS Sharmila: కూటమి ప్రభుత్వంపై షర్మిల ఆగ్రహం.. ఎక్స్ వేదికగా విమర్శలు

YS Sharmila: ఏపీ కూటమి ప్రభుత్వంపై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రైతులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతే కాకుండా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతు పక్షపాతిగా హామీలు ఇచ్చి ప్రస్తుతం వారిని పట్టించుకోవడం లేదంటూ ట్విటర్ వేదికగా ఆమె ఆరోపించారు.

వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి రైతుల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. అంతే కాకుండా పల్నాడు జిల్లాలో రైతులు రాత్రి సమయం వరకు విత్తనాల కోసం నిలబడ్డారని తెలిపారు.సాగర్ కుడికాలువ క్రింద పంట సాగు చేసే రైతులకు విత్తన కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. కుండపోత వర్షాలోనూ మహిళలు విత్తనాల కోసం ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత ప్రభుత్వం రైతుల కోసం పని చేయకపోవడం వల్లే రైతులు కూటమికి పట్టం కట్టారని తెలిపారు.

జగన్ రైతులను నిండా ముంచాడనే కదా.. 11 సీట్లకు పరిమితం చేశారు. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని తెలిపారు. రైతులను వ్యతిరేకించే బీజేపీతో జతకూడటంతో పాటు రైత పక్షపాతిగా ఉంటామని చెబుతూ అసత్యపు హామీలను కూటమి ఇచ్చిందని అన్నారు. ఇప్పటికైనా రైతులకు అవసరం అయిన 384 రకం విత్తనాలను వెంటనే పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×