E-Paper
Advertisement

Indian Railways: రైలు నుంచి పడి చనిపోయిన భర్త.. పరిహారం ఇవ్వని రైల్వే, సుప్రీం కోర్టు ఊహించని తీర్పు!

Indian Railways: రైలు నుంచి పడి చనిపోయిన భర్త.. పరిహారం ఇవ్వని రైల్వే, సుప్రీం కోర్టు ఊహించని తీర్పు!
Advertisement

Indian Railway Compensation:

ఉజ్జయినీ వెళ్లేందుకు ఓ వ్యక్తి రైలు ఎక్కాడు. అప్పటికే రైలు ప్రయాణీకులతో కిక్కిరిసిపోయింది. కొంత దూరం వెళ్లాక తోపులాట జరగడంతో ఓ వ్యక్తి రైల్లో నుంచి పడిపోయాడు. ఈ ఘటనలో అతడు దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై బాధితుడి కుటుంబ సభ్యులు పరిహారం చెల్లించాలని రైల్వేను కోరారు. అతడికి టికెట్ లేదనే సాకుతో పరిహారం ఇచ్చేందుకు నిరాకరించాయి. అయితే, సుప్రీంకోర్టు ఇప్పుడు ఆ వ్యక్తి భార్య, కొడుకుకు రూ.8 లక్షలు చెల్లించాలని రైల్వేను ఆదేశించింది. 8 ఏళ్ల పోరాటం ఫలించడం పట్ల బాధిత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

మే 19, 2017న ఉజ్జయినీ వెళ్లడానికి ఇండోర్ రైల్వే జంక్షన్‌ లో ఓ వ్యక్తి సెకండ్ క్లాస్ రైల్వే టికెట్ కొన్నాడు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ రైలు ఎక్కాడు. రైలు నార్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే సమయంలో ప్రయాణీకులు తోసుకున్నారు. ఈ ఘటనలో సదరు వ్యక్తి రైల్లో నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతడి తలకు తీవ్ర గాయాలై చనిపోయాడు. అయితే, సెక్షన్ 174 CrPC కింద విచారణ చేసి కేసు క్లోజ్ చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందంటూ ఫైల్ క్లోజ్ చేశారు. తలకు తగిలిన గాయం కారణంగా తీవ్ర రక్తస్రావం జరిగి ఆయన చనిపోయినట్లు పోస్ట్ మార్టం నివేదిక వెల్లడించింది.

న్యాయపోరాటానికి దిగిన కుటుంబ సభ్యులు

Advertisement

భర్తను కోల్పోయిన భార్య, ఆమె మైనర్ కుమారుడు సహా కుటుంబ సభ్యులు భోపాల్‌ లోని రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్‌ లో కేసు వేశారు. రూ. 12,00,000 పరిహారాన్ని కోరారు. అయితే, రైలు ప్రయాణం చేస్తున్న వ్యక్తి టికెట్ లేకుండా రైలు ఎక్కాడని, అందుకే పరిహారం అందించలేమని రైల్వే వాదించింది. ఆయన దగ్గర టికెట్ లేదని వెల్లడించింది. ట్రిబ్యునల్ రైల్వే వాదనతో అంగీకరించి పిటీషన్ ను తోపిపుచ్చింది.

Read Also:  రైల్లో సీటు కోసం అన్నాదమ్ముల కంత్రీ ఐడియా.. చివరికి కటకటాల్లోకి..

బాధిత కుటుంబానికి అనుకూలంగా సుప్రీం తీర్పు

Advertisement

ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ హైకోర్టుకు అప్పీల్ చేశారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 123(c)(2) ప్రకారం ఇది దారుణమైన ఘటన అని కోర్టు అంగీకరించినప్పటికీ, మరణించిన వ్యక్తి టికెట్ లేకుండా ప్రయాణించాడనే ట్రిబ్యునల్ తీర్మానంతో ఏకీభవించింది. అప్పీల్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పుతో అసంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్టోబర్ 8, 2025న సుప్రీంకోర్టు బాధితులకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.  సుప్రీంకోర్టు రైల్వేకు రూ. 8 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. టికెట్ దొరకలేదనే కారణంతో అతడు టికెట్ లేకుండా ప్రయాణం చేశాడని చెప్పడం సరికాదన్నారు. కచ్చితంగా బాధితులకు పరిహారం అందించాల్సిందేనని తేల్చి చెప్పింది. 8 ఏళ్ల పోరాటం తర్వాత కేసు గెలవడం పట్ల బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది.

Read Also: రణరంగంగా మారిన రైల్వే స్టేషన్, పిచ్చ పిచ్చగా కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. నెట్టింట వీడియో వైరల్!

Related News

లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!

Zojila Tunnel: 3 గంటల ప్రయాణం ఇక 20 నిమిషాల్లోనే.. చైనా, పాక్‌లకు మైండ్ బ్లాక్!

నార్త్ గోవా Vs సౌత్ గోవా.. మీ నెక్స్ట్ ట్రిప్‌కి ఏది బెస్ట్? ఈ ఒక్క క్లారిటీ ఉంటే చాలు!

అచ్చం అద్దం లాగే.. ఇండియాలోని ఈ సరస్సులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ!

అరుణాచలం ట్రిప్.. భక్తులకు తప్పిన తిప్పలు, చర్లపల్లి నుంచి నేరుగా రైళ్లు

రైల్వే ఫుడ్‌ పై AI కన్ను.. ఇక అపరిశుభ్రతకు నో ఛాన్స్!

తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం IRCTC బెటరా? RailOne బెటరా?

తత్కాల్ టికెట్ వెంటనే కన్ఫర్మ్ కావాలా? IRCTCలో సింపుల్ గా ఈ సెట్టింగ్స్ చేయండి!

Big Stories

Advertisement
×