E-Paper
Advertisement

YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..

YS Sharmila : రాజశేఖర్‌రెడ్డి ఆశయాల నేరవేర్చడానికే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరానని వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు.

YS Sharmila: తండ్రి ఆశయాలు కోసమే కాంగ్రెస్‌లో చేరా.. వైయస్‌కు నివాళులర్పించిన షర్మిల..
Advertisement

YS Sharmila : రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు నేరవేర్చడానికే తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్లు వైఎస్‌ షర్మిల ప్రకటించారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఆమె ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించారు.

తండ్రి ఆశీర్వాదం కోసమే ఇడుపులపాయ వచ్చానని తెలిపారు. తన తండ్రి రాజశేఖర్‌రెడ్డికి కాంగ్రెస్‌, ఆ పార్టీ సిద్ధాంతాలంటే ప్రాణంతో సమానం అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నేరవేర్చడం కోసం ఎంతదూరమైనా వెళ్లేవారని ఆమె పేర్కొన్నారు. భారత దేశంలో రాజ్యాంగానికి గౌరవం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలు నిలబడాలి, దేశానికి మంచి జరగాలనే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆమె ప్రకటించారు. దేశానికి రాహుల్‌గాంధీని ప్రధానిగా చేసేంత వరకు తన పోరాటం ఆగదు అని ప్రకటించారు.

Advertisement

కొన్ని పార్టీలు ఇతర పార్టీలకు బానిసలుగా మారాయని మాజీ మంత్రి రఘవీరారెడ్డి పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ బానిస కాదన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధానిని చేసే వరకు అందరం కలిసి సమిష్టగా పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి దిక్సూచిలా వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పనిచేశారని సీనియర్ నేత కేవీపీ రామచంద్రరరావు పేర్కొన్నారు. వైఎస్ హయంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఆయన ఆశయాల కోసం, రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసేందుకే షర్మిల కాంగ్రెస్‌లో వచ్చారని ఆయన వివరించారు. షర్మిల సమక్షంలో మాజీ మంత్రి అహ్మదుల్లా కాంగ్రెస్‌లో చేరారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత షర్మిల తొలిసారి కడప జిల్లాకు వచ్చారు. షర్మిలకు కాంగ్రెస్‌ నేతలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. సీనియర్‌నేతలు తులసిరెడ్డి, శైలజానాథ్‌, గౌతమ్‌, అహ్మదుల్లా తదితరులు షర్మిలకు స్వాగతం పలికారు.

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×