E-Paper
Advertisement

Perni Nani: పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత.. ప్రభుత్వంపై పేర్నినాని తీవ్ర విమర్శలు

Perni Nani: పీపీపీ విధానంపై తీవ్ర వ్యతిరేకత.. ప్రభుత్వంపై పేర్నినాని తీవ్ర విమర్శలు
Advertisement

Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ (PPP – పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నిర్ణయాన్ని మొదటి నుంచే వైసీపీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తుండగా, తాజాగా అధికార పార్టీ నేతలు, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం పిలిచిన టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంపై ఇరు వర్గాలు పరస్పర ఆరోపణలకు దిగాయి.

టెండర్లకు మిశ్రమ స్పందన రావడానికి వైసీపీ నేతలే కారణమని.. అధికార పార్టీ నాయకులు విమర్శలు గుప్పిస్తుండగా, అందుకు వైసీపీ శ్రేణులు అదే స్థాయిలో ఘాటు కౌంటర్లు ఇస్తున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాన్ని వైసీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే నిధులు సమకూర్చి మెడికల్ కాలేజీలు నిర్మించి, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే డిమాండ్‌ను పార్టీ మరోసారి బలంగా వినిపిస్తోంది.

Advertisement

ఈ అంశంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని.. ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైద్య రంగాన్ని ప్రైవేట్‌పరం చేయాలన్నదే కూటమి ప్రభుత్వ అసలైన లక్ష్యమని ఆయన ఆరోపించారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రజాసేవ కోణంలో కాకుండా లాభాపేక్షతోనే పనిచేస్తారని వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టడంలేదని విమర్శించారు.

పీపీపీ, పీ4 వంటి విధానాలతో ఎవరు బాగుపడ్డారో వారికే తెలియాలి. ప్రజలకు మాత్రం ఒరిగిందేమీ లేదు. 90 పైసలకే 50 కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నారు. గూగుల్, టీసీఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా ఇంత చౌకగా ఎక్కడైనా భూములు తీసుకున్నాయా? అంటూ పేర్ని నాని తీవ్ర స్థాయిలో ఎద్దేవా చేశారు. పేదల పేరు చెప్పి భూములను దోచుకునే విధానం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement

రాజధాని ప్రాంత రైతుల సమస్యలను కూడా ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్ని నాని విమర్శించారు. సీఆర్‌డీఏ అధికారులు రైతుల గోడును పట్టించుకోవడంలేదని, భూములు ఇచ్చిన రైతులు నేటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతులు, ఉద్యోగులు, కూలీలు ఇలా అన్ని వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొందని ఆయన పేర్కొన్నారు.

Also Read: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగుల నుంచి కూలీల వరకు.. అందరూ భయంతో జీవిస్తున్నారు. గత 20 నెలల్లో ప్రజలను భయకంపితులను చేసే పరిపాలన జరిగింది. ప్రజాస్వామ్య విలువలు క్షీణిస్తున్నాయి అంటూ పేర్ని నాని ఆరోపించారు. వైద్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ చేతుల్లోకి అప్పగించాలనే తాపత్రయంతో చంద్రబాబు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×