E-Paper
Advertisement

Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా
Advertisement

Hyderabad News: జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత పోలీస్ శాఖలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు పోలీస్ కమిషరేట్లలో భారీ ప్రక్షాళన ఉండబోనుంది. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించనున్నారు. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ పునర్విభజన

Advertisement

జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. గతంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి అమాంతంగా పెరిగింది. పరిధి పెరగడంతో పోలీసు కమిషనరేట్లలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. కొత్తగా విస్తరించిన జీహెచ్ఎంసీని 12 జోన్లుగా చేయనున్నారు. అందులో హైదరాబాద్‌ కమిషనరేట్‌కు ఆరు జోన్లు, సైబరాబాద్‌కు మూడు జోన్లు, రాచకొండ కమిషనరేట్‌ను మరో మూడు జోన్లు ఉండనున్నాయి.

ఇందులోభాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు వెళ్లాయి. దీంతో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి.

Advertisement

మూడు పోలీసు కమిషనరేట్లలో కీలక మార్పులు

ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మార్పులు జరిగాయి. గతంలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఉన్నాయి. ఇప్పుడు మొయినాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు శేరిలింగంపల్లి‌ జోన్ విస్తరించింది. మాదాపూర్‌ను కూకట్‌పల్లి జోన్‌లో కలిపేశారు. గతంలో ఉన్నమాదిరిగానే కుత్బుల్లాపూర్ అలాగే ఉంచారని తెలుస్తోంది.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి పెద్ద జోన్లు రానున్నాయి. వాటిలో ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. గతంలో ఈ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి జిల్లా ఉండేది. తాజాగా యాదాద్రి జిల్లా సెపరేట్ చేసి జిల్లా ఎస్పీ పరిధిలోకి రానుంది. మహేశ్వరం జోన్, షాద్ నగర్, చేవెళ్ల జోన్లను కలుపుతూ ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌’గా ఏర్పాటు చేయాలన్నది పోలీసు శాఖ ఆలోచనగా తెలుస్తోంది.

ALSO READ:  మేడారానికి పోటెత్తిన భక్తులు..  సెలవులు కావడంతో కిక్కిరిసిన జనం

గతంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు కొత్తగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధి పెరగడంతో లా అండ్ ఆర్డర్ మరింత పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారులతో శనివారం డీజీపీ సమావేశమయ్యారు.

అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపో మాపో జోన్లపై డీజీపీ ఉత్తర్వులు ఇవ్వనున్నారని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. క్రైమ్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో వాటిని జోన్లుగా డివిజన్ చేశారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. దీనివల్ల క్రైమ్ రేటు తగ్గే అవకాశముందని భావిస్తోంది.

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×