Hyderabad: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో రూ.4000కే ల్యాప్ టాప్ అని ఓ షాప్ యజమానులు ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసింది. పిల్లలు గేమ్స్ ఆడుకునేందుకు, సాధారణ పనులకు వినియోగించేలా ల్యాప్ టాప్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్పారు. వేల విలువైన ల్యాప్ టాప్ ఛీప్ గా దొరుకుతుండడంతో జనం బారులు తీరారు.
దిల్సుఖ్నగర్లో ఓ సంస్థ రూ.4,000కే ల్యాప్టాప్ బంపర్ సేల్ అంటూ ప్రకటన చేసింది. ఈ ప్రకటన చూసిన జనం ఆదివారం ఉదయం నుంచే ఆ షాప్ ముందు క్యూ కట్టారు. షాప్ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. తక్కువ ధరకు బ్రాండెడ్ ల్యాప్టాప్లు లభిస్తాయనే ఆశతో వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలివచ్చారు. రద్దీ గంట గంటకు పెరుగుతుండడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. షాపులోకి వెళ్లే మార్గం చిన్నగా ఉండడం జనం కిక్కిరిసి పోయారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, తగిన ఏర్పాట్లు చేయాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు.
HYD దిల్సుఖ్నగర్లో రూ.4000కే ల్యాప్టాప్.. ఎగబడ్డ జనం
దిల్సుఖ్నగర్లో ఓ సంస్థ రూ.4,000కే ల్యాప్టాప్ బంపర్ సేల్ అంటూ ప్రకటన ఇచ్చింది. చూసిన జనం ఆదివారం ఉదయం క్యూ కట్టారు. షాప్ ముందు తీవ్ర రద్దీ నెలకొంది. తక్కువ ధరకు బ్రాండెడ్ ల్యాప్టాప్లు లభిస్తాయనే ఆశతో వివిధ ప్రాంతాల… pic.twitter.com/WdmUf60QTK
— ChotaNews App (@ChotaNewsApp) December 28, 2025
గత కొన్ని రోజులుగా రూ.4 వేలకే ల్యాప్ టాప్ అంటూ సోషల్ మీడియాలో వీడియోల్లో ఉదరగొట్టారు. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ లను బాగుచేసి, అప్డేట్ చేసి అతి తక్కువకే ఇస్తున్నామని ఆ వీడియోల్లో ప్రచారం చేశారు. వందల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయని, చాలా తక్కువ ధరకే పనిచేసే ల్యాప్ టాప్ ఇస్తున్నామని నిర్వాహకులు ప్రచారం చేశారు. కనీసం రూ.20-30 వేలు పెడితే కానీ సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ రాకపోవడం, రూ.4 వేలకే ల్యాప్ టాప్ అని చెప్పడంతో జనం బారులు తీరారు. దీంతో దిల్ సుఖ్ నగర్ లో రద్దీ నెలకొంది.
Also Read: KA Paul: ‘బాలయ్య కడుపు చేస్తా’ అంటే ఏం చేశారు?.. శివాజీ వివాదంపై కేఏ పాల్ ఫైర్