E-Paper
Advertisement

Hyderabad: రూ.4 వేలకే ల్యాప్ టాప్.. భారీగా ఎగబడ్డ జనం.. చివరికి

Hyderabad: రూ.4 వేలకే ల్యాప్ టాప్.. భారీగా ఎగబడ్డ జనం.. చివరికి
Advertisement

Hyderabad: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లో రూ.4000కే ల్యాప్ టాప్ అని ఓ షాప్ యజమానులు ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసింది. పిల్లలు గేమ్స్ ఆడుకునేందుకు, సాధారణ పనులకు వినియోగించేలా ల్యాప్ టాప్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెప్పారు. వేల విలువైన ల్యాప్ టాప్ ఛీప్ గా దొరుకుతుండడంతో జనం బారులు తీరారు.

బంపర్ సెల్.. జనం బారులు

దిల్‌సుఖ్‌నగర్‌‌లో ఓ సంస్థ రూ.4,000కే ల్యాప్‌టాప్ బంపర్ సేల్ అంటూ ప్రకటన చేసింది. ఈ ప్రకటన చూసిన జనం ఆదివారం ఉదయం నుంచే ఆ షాప్ ముందు క్యూ కట్టారు. షాప్ వద్ద తీవ్ర రద్దీ నెలకొంది. తక్కువ ధరకు బ్రాండెడ్ ల్యాప్‌టాప్‌లు లభిస్తాయనే ఆశతో వివిధ ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలివచ్చారు. రద్దీ గంట గంటకు పెరుగుతుండడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు. షాపులోకి వెళ్లే మార్గం చిన్నగా ఉండడం జనం కిక్కిరిసి పోయారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, తగిన ఏర్పాట్లు చేయాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

సోషల్ మీడియాలో ప్రచారం

గత కొన్ని రోజులుగా రూ.4 వేలకే ల్యాప్ టాప్ అంటూ సోషల్ మీడియాలో వీడియోల్లో ఉదరగొట్టారు. సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ లను బాగుచేసి, అప్డేట్ చేసి అతి తక్కువకే ఇస్తున్నామని ఆ వీడియోల్లో ప్రచారం చేశారు. వందల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయని, చాలా తక్కువ ధరకే పనిచేసే ల్యాప్ టాప్ ఇస్తున్నామని నిర్వాహకులు ప్రచారం చేశారు. కనీసం రూ.20-30 వేలు పెడితే కానీ సెకండ్ హ్యాండ్ ల్యాప్ టాప్ రాకపోవడం, రూ.4 వేలకే ల్యాప్ టాప్ అని చెప్పడంతో జనం బారులు తీరారు. దీంతో దిల్ సుఖ్ నగర్ లో రద్దీ నెలకొంది.

Advertisement

Also Read: KA Paul: ‘బాలయ్య కడుపు చేస్తా’ అంటే ఏం చేశారు?.. శివాజీ వివాదంపై కేఏ పాల్ ఫైర్

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×