E-Paper
Advertisement

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
Advertisement

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసులో కోర్టుకు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బయటపెట్టారన్న ఆరోపణలతో గోరంట్ల మాధవ్ పై గతంలో పోక్సో కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు హాజరవ్వాలని మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో విజయవాడలోని పోక్సో కోర్టు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

నోటీసులు ఇచ్చినా

రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో గోరంట్లపై పోక్సో కేసు నమోదైంది. అత్యాచారానికి గురైన బాలికకు వివరాలను బహిరంగంగా వెల్లడించడం పోక్సో చట్టానికి విరుద్ధమని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అంశంలో కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మాధవ్ విచారణకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులో పిటిషన్

Advertisement

పోక్సో కోర్టు తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. గోరంట్ల సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

Also Read:  గోరంట్ల మాధవ్‌కు భారీ షాక్.. పోలీసులు మరోసారి నోటీసులు 

బీఎన్ఎస్, పోక్సో సెక్షన్లు

Advertisement

వాసిరెడ్డి పద్మ తన ఫిర్యాదులో.. గోరంట్ల మాధవన్ ఆన్ లైన్ లో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించారని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారికి, ముఖ్యంగా మైనర్లకు, వారి గుర్తింపును బయటపెట్టకుండా చట్టబద్ధమైన రక్షణ ఉందన్నారు.అయితే గోరంట్ల మాధవ్ బాధిత మైనర్ల వివరాలను బహిర్గతం చేసి చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక బాధితుల సమాచారాన్ని బయటపెట్టడం బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 72, 79, పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం నేరమని పద్మ తన ఫిర్యాదులో తెలిపారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×