E-Paper
Advertisement

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్.. పోక్సో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్
Advertisement

Ex MP Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు బిగ్ షాక్ తగిలింది. పోక్సో కేసులో కోర్టుకు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అత్యాచారానికి గురైన బాలిక వివరాలను బయటపెట్టారన్న ఆరోపణలతో గోరంట్ల మాధవ్ పై గతంలో పోక్సో కేసు నమోదు అయింది. ఈ కేసు విచారణకు హాజరవ్వాలని మాధవ్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో విజయవాడలోని పోక్సో కోర్టు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

నోటీసులు ఇచ్చినా

రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో గోరంట్లపై పోక్సో కేసు నమోదైంది. అత్యాచారానికి గురైన బాలికకు వివరాలను బహిరంగంగా వెల్లడించడం పోక్సో చట్టానికి విరుద్ధమని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ అంశంలో కోర్టు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మాధవ్ విచారణకు హాజరు కాకపోవడంతో.. తాజాగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టులో పిటిషన్

Advertisement

పోక్సో కోర్టు తనపై జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను వెనక్కి తీసుకోవాలని కోరుతూ.. గోరంట్ల సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది.

Also Read:  గోరంట్ల మాధవ్‌కు భారీ షాక్.. పోలీసులు మరోసారి నోటీసులు 

బీఎన్ఎస్, పోక్సో సెక్షన్లు

Advertisement

వాసిరెడ్డి పద్మ తన ఫిర్యాదులో.. గోరంట్ల మాధవన్ ఆన్ లైన్ లో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు అత్యాచార బాధితుల పేర్లను వెల్లడించారని పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారని ఆమె తెలిపారు. లైంగిక వేధింపుల నుంచి బయటపడిన వారికి, ముఖ్యంగా మైనర్లకు, వారి గుర్తింపును బయటపెట్టకుండా చట్టబద్ధమైన రక్షణ ఉందన్నారు.అయితే గోరంట్ల మాధవ్ బాధిత మైనర్ల వివరాలను బహిర్గతం చేసి చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొంది. లైంగిక బాధితుల సమాచారాన్ని బయటపెట్టడం బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్లు 72, 79, పోక్సో చట్టం సెక్షన్ 23 ప్రకారం నేరమని పద్మ తన ఫిర్యాదులో తెలిపారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×