Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు విజయవాడ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మైనర్ బాలికల పేర్లు వెల్లడించిన కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.
ఓ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు దారితీశాయి. మైనర్ బాలికల వివరాలను ఆయన బహిరంగంగా వెల్లడించడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై గతంలోనే వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇప్పటికే ఈ అంశంపై గోరంట్ల మాధవ్ తన వివరణను తెలియజేశారు. అంతేకాకుండా.. గతంలో కూడా విజయవాడ పోలీసులు నిర్వహించిన విచారణకు ఆయన ఒకసారి హాజరయ్యారు. అయినప్పటికీ, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంపై రాజకీయ వర్గాలలోనూ, ప్రజల్లోనూ తెగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరైనప్పటికీ.. మళ్లీ నోటీసులు ఇవ్వడం వెనుక కారణాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Witness Cold Wave: రాష్ట్రంలో భీకరమైన చలిగాలులు.. ఈ సమయంలో అసలు బయటకు వెళ్లొద్దు.. జాగ్రత్త!