BigTV English
Advertisement

Varra Ravinder Reddy Arrest: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్..

Varra Ravinder Reddy Arrest: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్..

తెలుగు దేశం పార్టీ నేతలపై, మరికొంత మంది వ్యక్తులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వైఎస్ఆర్‌సీపీ కి సంబంధించిన వ్యక్తులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతోంది. తాజాగా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ హయంలో జగన్‌ను విమర్శించిన టీడీపీ నాయకులపైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందేవారు. అంతేకాదు వివేకా హత్య కేసులో జగన్‌పైన, అవినాష్‌పైన ఎలక్షన్ టైమ్‌లో విమర్శలు చేసిన, షర్మిల, సునీతలపైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. జగనన్న ఆదేశిస్తే.. చాలు ఏది చేయడానికైన సిద్ధమే అనేలా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో  రవీందర్ రెడ్డి పోస్టులకు మనస్థాపానికు గురైన షర్మిల, సునీత, విజయమ్మ కలిసి ఇతనిపై గతంలోనే హైదారాబాద్, విజయవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

Also Read: ఒక్క పోస్ట్.. వైసీపీ నేతల పరువు పాయే


ఇక తాజాగా .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌, వంగలపూడి అనితలపై గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో రవీందర్ రెడ్డి అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లో రవీందర్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రవీందర్ రెడ్డిని బుధవారం సాయంత్రం పులివెందులో అరెస్ట్ చేసి, అతన్ని కడప పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతానికి కడపలో ఉన్న అతన్ని అక్కడి నుంచి  కోర్టులో హాజరుపరిచి, ఆ తరువాత మంగళగిరి పోలీస్‌స్టేషన్‌‌కి తీసుకొస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం సరైన విధానం కాదని ప్రభుత్వం గత కొన్ని రోజులుగా అతనికి హెచ్చరికలు జారీ చేసింది.

 

 

Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×