E-Paper
Advertisement

Varra Ravinder Reddy Arrest: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్..

Varra Ravinder Reddy Arrest: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్..
Advertisement

తెలుగు దేశం పార్టీ నేతలపై, మరికొంత మంది వ్యక్తులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వైఎస్ఆర్‌సీపీ కి సంబంధించిన వ్యక్తులను వరుసగా అరెస్ట్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కొనసాగుతోంది. తాజాగా పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్‌సీపీ హయంలో జగన్‌ను విమర్శించిన టీడీపీ నాయకులపైన సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టి పైశాచిక ఆనందం పొందేవారు. అంతేకాదు వివేకా హత్య కేసులో జగన్‌పైన, అవినాష్‌పైన ఎలక్షన్ టైమ్‌లో విమర్శలు చేసిన, షర్మిల, సునీతలపైన కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. జగనన్న ఆదేశిస్తే.. చాలు ఏది చేయడానికైన సిద్ధమే అనేలా పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలో  రవీందర్ రెడ్డి పోస్టులకు మనస్థాపానికు గురైన షర్మిల, సునీత, విజయమ్మ కలిసి ఇతనిపై గతంలోనే హైదారాబాద్, విజయవాడ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు.

Advertisement

Also Read: ఒక్క పోస్ట్.. వైసీపీ నేతల పరువు పాయే

ఇక తాజాగా .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌, వంగలపూడి అనితలపై గత వారం రోజులుగా సోషల్‌ మీడియాలో రవీందర్ రెడ్డి అసభ్యకరంగా పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. పులివెందుల, మంగళగిరి, హైదరాబాద్‌లో రవీందర్ రెడ్డిపై పలు కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రవీందర్ రెడ్డిని బుధవారం సాయంత్రం పులివెందులో అరెస్ట్ చేసి, అతన్ని కడప పోలీస్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతానికి కడపలో ఉన్న అతన్ని అక్కడి నుంచి  కోర్టులో హాజరుపరిచి, ఆ తరువాత మంగళగిరి పోలీస్‌స్టేషన్‌‌కి తీసుకొస్తారని తెలుస్తోంది. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం సరైన విధానం కాదని ప్రభుత్వం గత కొన్ని రోజులుగా అతనికి హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×