BigTV English
Advertisement

YSRCP: బీజేపీ తిడుతున్నా.. దగ్గరవుతున్న వైసీపీ..

YSRCP: బీజేపీ తిడుతున్నా.. దగ్గరవుతున్న వైసీపీ..
modi jagan

YSRCP: ఇటీవలే బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఆమె పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ అధికార వైసీపీని ఏకిపారేస్తున్నారు. అవినీతి పాలనంటూ, అరాచక నేతలంటూ, రాష్ట్రం అధో:గతి అంటూ మాటల తూటాలు వదులుతున్నారు. అంతకుముందు బీజేసీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా లాంటి వాళ్లు ఏపీకి వచ్చి మరీ.. సభలు పెట్టి.. జగన్‌ను తిట్టి వెళ్లారు. అవినీతి పాలన అంతుచూస్తామని హెచ్చరించారు. వారి వార్నింగులపై సీఎం జగన్ సైతం రియాక్ట్ అయ్యారు. మీ జగనన్నకు ఎవరి సపోర్ట్ ఉండదని.. ఒంటరిగానే గెలుస్తానంటూ ఛాలెంజ్ చేశారు.


అప్పటినుంచి వైసీపీ వర్సెస్ బీజేపీ పోరు జోరుగా సాగుతుందని అనుకున్నారంతా. పురందేశ్వరి సైతం గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ, వైసీపీ నుంచి మాత్రం అటాక్ ఆగిపోయింది. దాడి కాదు కదా.. ఢిల్లీలో అడక్కుండానే మద్దతు కూడా ఇస్తున్నారు. తాజాగా లోక్‌సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అధికార ఎన్డీఏ కూటమికి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నందున అవిశ్వాస తీర్మానానికి విలువ లేదన్నారు వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి. మణిపూర్‌లో జరిగిన ఘటనలు అత్యంత బాధాకరమని.. వీలైనంత త్వరగా ప్రజా శాంతిస్థాపన జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభలో కోరారు.

వైసీపీ తీరుతో.. బీజేపీతో బయటికి పోరాటం.. లోలోన ఆరాటం అన్నట్టు ఉందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలొచ్చి ఉత్తిత్తిగా తిట్టేసి వెళ్లిపోయారని.. ఎలక్షన్ సీజన్ కాబట్టి అలాంటి మాటలు కామనేనని అంటున్నారు. బీజేపీకి జనసేనతో పొత్తు ఉండటం.. టీడీపీనీ జట్టులో చేర్చుకోవాలని జనసేనాని ప్రయత్నం చేస్తుండటంతో వైసీపీ ఉలిక్కిపడుతోంది. అందుకే, మేమున్నాక మళ్లీ టీడీపీ ఎందుకు అనేలా.. బీజేపీకి అడక్కుండానే పార్లమెంట్‌లో సపోర్ట్ చేస్తోందని చెబుతున్నారు. ఏపీలోని అన్నిపార్టీలూ బీజేపీకే జై కొడుతుండటం ఆసక్తికర రాజకీయం.


Related News

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

YS Jagan Mohan Reddy: చంద్రబాబు చేసిందేం లేదు.. మన క్రెడిట్ చోరీ చేశాడు.. జగన్ విమర్శలు

CM Chandrababu: ‘నాకు హార్డ్ వర్క్ అవసరం లేదు.. స్మార్ట్ వర్క్ కావాలి’, అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

Sub Registrar Office Seized: మధురవాడ సబ్ రిజిస్టార్ కార్యాలయం సీజ్..

Amaravati: ఏపీలో మళ్లీ మొదటికి.. ప్రస్తుతానికి ఆ రెండు మాత్రమే, ఫైనల్ నిర్ణయం సీఎందే

Minister Narayana: మంత్రి నారాయణ దుబాయ్ టూర్ పూర్తి.. ఏపీకి ఏమేం వస్తాయంటే?

Big Stories

×