E-Paper
Advertisement

YSRCP: బీజేపీ తిడుతున్నా.. దగ్గరవుతున్న వైసీపీ..

YSRCP: బీజేపీ తిడుతున్నా.. దగ్గరవుతున్న వైసీపీ..
Advertisement
modi jagan

YSRCP: ఇటీవలే బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. ఆమె పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ అధికార వైసీపీని ఏకిపారేస్తున్నారు. అవినీతి పాలనంటూ, అరాచక నేతలంటూ, రాష్ట్రం అధో:గతి అంటూ మాటల తూటాలు వదులుతున్నారు. అంతకుముందు బీజేసీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్ షా లాంటి వాళ్లు ఏపీకి వచ్చి మరీ.. సభలు పెట్టి.. జగన్‌ను తిట్టి వెళ్లారు. అవినీతి పాలన అంతుచూస్తామని హెచ్చరించారు. వారి వార్నింగులపై సీఎం జగన్ సైతం రియాక్ట్ అయ్యారు. మీ జగనన్నకు ఎవరి సపోర్ట్ ఉండదని.. ఒంటరిగానే గెలుస్తానంటూ ఛాలెంజ్ చేశారు.

అప్పటినుంచి వైసీపీ వర్సెస్ బీజేపీ పోరు జోరుగా సాగుతుందని అనుకున్నారంతా. పురందేశ్వరి సైతం గట్టిగానే మాట్లాడుతున్నారు. కానీ, వైసీపీ నుంచి మాత్రం అటాక్ ఆగిపోయింది. దాడి కాదు కదా.. ఢిల్లీలో అడక్కుండానే మద్దతు కూడా ఇస్తున్నారు. తాజాగా లోక్‌సభలో విపక్ష కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అధికార ఎన్డీఏ కూటమికి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నందున అవిశ్వాస తీర్మానానికి విలువ లేదన్నారు వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి. మణిపూర్‌లో జరిగిన ఘటనలు అత్యంత బాధాకరమని.. వీలైనంత త్వరగా ప్రజా శాంతిస్థాపన జరిగేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సభలో కోరారు.

Advertisement

వైసీపీ తీరుతో.. బీజేపీతో బయటికి పోరాటం.. లోలోన ఆరాటం అన్నట్టు ఉందనే విమర్శలు వస్తున్నాయి. బీజేపీ పెద్దలొచ్చి ఉత్తిత్తిగా తిట్టేసి వెళ్లిపోయారని.. ఎలక్షన్ సీజన్ కాబట్టి అలాంటి మాటలు కామనేనని అంటున్నారు. బీజేపీకి జనసేనతో పొత్తు ఉండటం.. టీడీపీనీ జట్టులో చేర్చుకోవాలని జనసేనాని ప్రయత్నం చేస్తుండటంతో వైసీపీ ఉలిక్కిపడుతోంది. అందుకే, మేమున్నాక మళ్లీ టీడీపీ ఎందుకు అనేలా.. బీజేపీకి అడక్కుండానే పార్లమెంట్‌లో సపోర్ట్ చేస్తోందని చెబుతున్నారు. ఏపీలోని అన్నిపార్టీలూ బీజేపీకే జై కొడుతుండటం ఆసక్తికర రాజకీయం.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×