E-Paper
Advertisement

Ysrcp tweet: ఈ ట్వీట్ వేయడానికి మీకు చేతులెలా వచ్చాయి..?

Ysrcp tweet: ఈ ట్వీట్ వేయడానికి మీకు చేతులెలా వచ్చాయి..?
Advertisement

అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా గిరిజన తండాలకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇంకా ఆ పని చేయలేదని, అందుకే డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తున్న గర్భిణి మార్గమధ్యంలోనే ప్రసవించిందంటూ వైసీపీ అధికారికంగా ఓ ట్వీట్ వేసింది. ఐదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోడ్లు ఎందుకు వేయలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ట్వీట్ వేసి విమర్శించడం అవసరమా అంటూ ట్రోలింగ్ మొదలైంది. తన చేతగాని తనాన్ని ఇలా జగన్ బయటపెట్టుకున్నారని కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు.

అసలేమైంది..?
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాది సంక్రాంతి నాటికి రాష్ట్రంలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేస్తామని, కొత్త రోడ్లు వేస్తామని హామీ ఇచ్చింది. అన్నట్టుగానే చాలా చోట్ల రోడ్ల నిర్మాణం మొదలైంది. గుంతల రోడ్లు నేడు కొత్త రూపు సంతరించుకున్నాయి. గిరిజన తండాల్లో కూడా చాలా చోట్ల రోడ్లు వేయడం మొదలు పెట్టారు. అక్కడక్కడా కొంత ఆలస్యం జరుగుతున్న మాట వాస్తవమే అయినా, స్థానిక పరిస్థితుల దృష్ట్యా రోడ్ల నిర్మాణం అక్కడ సాధ్యం కాకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో తాజాగా వైసీపీ అధికారిక అకౌంట్ నుంచి ఒక ట్వీట్ పడింది.

Advertisement

40 ఏళ్ల‌కు పైగా రాజ‌కీయ అనుభ‌వం అని, 4 సార్లు ముఖ్య‌మంత్రిని అని గొప్ప‌లు చెప్పుకోవ‌డం, కాదు గిరిజ‌న బిడ్డ‌ల క‌ష్టాలు చూడండి అంటూ వైసీపీ ఓ ట్వీట్ వేసింది.
సంక్రాంతి నాటికే రాష్ట్రంలో రోడ్లన్నీ పూర్తి చేస్తామంటీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇచ్చిన హామీలు పేప‌ర్ల‌లో వార్త‌ల వ‌ర‌కే ప‌రిమితం అయ్యాయ‌ని ఆ ట్వీట్ లో విమర్శించారు. విజయ‌న‌గ‌రం జిల్లా రేగ‌పుణ్య‌గిరి గ్రామంలో ఒక గర్భిణీని డోలీలో ఆస్ప‌త్రికి తీసుకెళ్తుండ‌గా ఆమె మార్గం మ‌ధ్య‌లోనే ప్ర‌స‌వించిందంటూ ట్వీట్ లో ప్రస్తావించారు. గిరిజ‌న బిడ్డ‌ల క‌ష్టాలు ప్రభుత్వానికి ప‌ట్ట‌వా? అని నిలదీశారు. గిరిజ‌నుల గురించి పెద్ద పెద్ద ప్ర‌సంగాలు ఇవ్వ‌డం మానేసి, ఇప్ప‌టికైనా వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంపై దృష్టి పెట్టాలంటూ ప్రత్యేకంగా పవన్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ వేసింది వైసీపీ.

Advertisement

నిస్సిగ్గుగా..
కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. పోనీ సంక్రాంతికి రోడ్లు వేస్తామని చెప్పి ఇంకా కాలయాపన చేయడం కూటమి తప్పే అనుకుందాం. మరి కూటమి కంటే ముందు ఐదేళ్లు వైసీపీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. ఆ పాలనలో విజయనగరం జిల్లా రేగపుణ్యగిరి కష్టాలు పాలకులకు పట్టలేదా..? అప్పటి సీఎం జగన్, అప్పట్లోనే రోడ్డు వేసి ఉంటే ఇప్పుడీ గిరిజనులకు డోలీ కష్టాలు తప్పేవి కదా..? ఆ మాత్రం స్పృహలేకుండా ఇప్పుడు వైసీపీ తగుదునమ్మా అంటూ ట్వీట్ వేయడం వారి భావ దారిద్రానికి నిదర్శనం అంటున్నారు టీడీపీ నేతలు.

వైసీపీ హయాంలో ఏపీలో రోడ్ల దుస్థితి ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసని, కూటమి అధికారంలోకి వచ్చాకే రోడ్లకు మరమ్మతులు చేశారని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని అంటున్నారు నేతలు. తన హయాంలో రోడ్లను పట్టించుకోని జగన్, ఇప్పుడు రోడ్లు లేవు అంటూ మాట్లాడటం దిగజారిన రాజకీయం అంటూ విమర్శిస్తున్నారు జనసైనికులు. గిరిజనుల సమస్యలు పరిష్కరించడంలో పవన్ కల్యాణ్ చిత్తశుద్ధిని ప్రశ్నించే స్థాయి జగన్ కు లేదంటున్నారు. తాము ఐదేళ్లుగా చేతగానివాళ్లుగా ఉండిపోయామని జగన్ ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నిస్తున్నారు.

Related News

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Big Stories

Advertisement
×