E-Paper
Advertisement

Bhagavan Ramana Maharshi : మౌన ముని.. జ్ఞాన ధుని

Bhagavan  Ramana Maharshi : మౌన ముని.. జ్ఞాన ధుని
Advertisement

Bhagavan Ramana Maharshi : ఆధ్యాత్మికత విషయంలో మనదేశం ప్రపంచానికే తలమానికం. ఇక్కడ జన్మించిన ఎందరో మునులు, రుషులు తమ ఆధ్యాత్మిక సాధనతో జీవన్ముక్తిని పొందటమే గాక.. భవిష్యత్ తరాల సాధకులకు దీపస్తంభాలుగా నిలిచారు. అలాంటివారిలో భగవాన్ రమణ మహర్షి ఒకరు. మౌనంతోనూ ఆత్మసాక్షాత్కారాన్ని పొందటం సాధ్యమని నిరూపించిన అరుదైన యోగిపుంగవులు రమణులు. నేడు ఆయన అవతరించిన రోజు.

రమణులు చాలా తక్కువగా ప్రసంగించేవారు. తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. ఈ సృష్టిలో కంటికి కనిపించేదంతా పరమాత్మ స్వరూపమేననీ, తోటి మనుషులతో బాటు నోరు లేని మూగజీవుల్లోనూ పరమాత్మ ఉన్నాడని రమణులు బోధించేవారు. ‘నీలో ఉన్నదే ఆ జీవుల్లోనూ ఉంది గనుక.. నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తావో, అన్నిటినీ అలాగే ప్రేమించాలి. పూజించాలి’ అని చెప్పేవారు.

Advertisement

ఒకసారి ఆశ్రమ వంటశాలలో అరటిపూలతో కూర వండుతున్నారు. ఈ క్రమంలో అరటిపువ్వు పైభాగంలోని దొప్పలను తీసి పారేసేవారు. ఒకరోజు రమణులు.. గోశాల వద్ద ఆ దొప్పలను బుట్టలతో బయటపారేయటాన్ని గమనించి.. వీటిలోనూ పోషకాలుంటాయని సిబ్బందికి చెప్పి, ఆ దొప్పలను స్వయంగా తరిగి, ఇంగువ, ఎండు మిరపకాయల వంటి దినుసులతో రుచికరమైన వంటకాన్ని తయారుచేశారు. ఇకపై వీటిని వృధా చేయకుండా వండి, భక్తులకు వడ్డించమని సూచించారు. రమణుల మాటకు సరేనన్న వంటవాళ్లు.. ఆ దొప్పలతో కూర వండేవారు.

అయితే కొన్నాళ్లకు మహర్షి గిరి ప్రదక్షిణ చేసి వస్తూండగా, దూరంగా ఓ చోట అప్పుడే పూడ్చిన ఓ గుంట కనిపించి, కర్రతో దానిని కదిలించారు. దీంతో ఆ గుంత నుంచి అరటి దొప్పలు బయటపడ్డాయి. వాటిని వండే ఓపిక లేక, తాను చూస్తే బాధపడతానని వంటవాళ్లు ఇలా కప్పిపెట్టారని రమణులు అర్థం చేసుకున్నారు. ‘అయ్యో! మీరు వండకపోతే.. ఓ బుట్టలో తీసుకుపోయి పశువులకు వేసినా అవి తినేవి కదా’ అని చిన్నగా అనుకుంటూ ముందుకు సాగిపోయారు. అంతే! ఆ తర్వాత ఆయన ఎప్పుడూ వంటశాలలో అరటి దొప్పల మాటెత్తలేదు. రమణులు ఏదైనా ఒక్కసారే చెప్పేవారు. అవతలివారు ఆ మాటను ఆచరించకపోతే.. వదిలేసేవారు గానీ బలవంతపెట్టి చేయించే అలవాటు వారికి లేదు. ‘చెప్పటమే మన వంతు, వినటం, విని ఆచరణలో పెట్టటం ఎదుటివారి పని’ అనేదే రమణుల ఆంతర్యం!

Related News

56 ఇంచుల ఛాతి.. 56 ఏళ్ల యువ‌కుడు… మ‌ధ్య‌లో జెన్‌-జీ కాక్రోచ్‌!

భేష్‌.. ఫండ్ పైస‌లు పంపిణీ.. బీఆరెస్ పార్టీ ఫండ్ నుంచి బాధిత రైతుల‌కు భ‌రోసా..

రూటు మార్చిన బీఆర్ఎస్.. జెన్-జి లక్ష్యంగా పాలిటిక్స్.. కేటీఆర్ వ్యూహం ఇదేనా?

తెగేదాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు..70వేల ఉద్యోగాల‌పై కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్న‌ కాంగ్రెస్!

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు.. నదుల ఉగ్రరూపం, చార్‌ధామ్ యాత్ర వాయిదా!

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

Big Stories

Advertisement
×