Chandragiri Politics: వైసీపీలో కీలక నేతగా వెలుగొందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం దూకుడుకి మారుపేరులా వ్యవహరించారు. అలాంటి ఫైర్బ్రాండ్ కనీళ్లు పెట్టుకోవడం హాట్టాపిక్గా మారింది. తన స్వగ్రామం తుమ్మల గుంట అత్మీయసభలో మీకు అన్ని చేసాను..కాని మీరు నా కొడుకును ఓడించారంటూ తన మనోవేదన వెళ్లగక్కిన సందర్భంలో ఆయన కళ్లు చెమర్చాయి.. గత 11 నెలలుగా గ్రామస్తులలో ఎలాంటి సమావేశాలు పెట్టని అయన నిన్న ఉన్నట్లుండి సమావేశం ఏర్పాటు చేసి మరీ తన ఆవేదన వ్యక్త పరుస్తూ.. తాను ముందు తుమ్మల గుంట వాసినని తర్వాతే చంద్రగిరి ఎమ్మెల్యేనని .. ఇప్పుడు నా దారి నేను చూసుకుంటే మీ పరిస్థితి ఏంటని వ్యాఖ్యానించడం చర్చల్లో నలుగుతోంది .. అసలు చెవిరెడ్డి ఎందుకు అంత అత్యవసరంగా అత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు? అసలేం జరుగుతోంది?
తాడేపల్లిలోని జగన్ నివాసంలో టీటీడీ సెట్ వేయించి విమర్శలపాలు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో వైసిపి కీలక నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అంటే తెలియని వారుండరు. జగన్ ప్రభుత్వంలో తుడా చైర్మన్గా వ్యవహరించిన ఆయన మంత్రి పదవి దక్కించుకోలేక పోయినప్పటికీ.. చాలా మంత్రి మంత్రులు కంటే ఎక్కువగానే చెలాయించారు . జగన్కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి ఏకంగా తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్లో తిరుమల దేవాలయ సెట్ వేయించి తన నాయకుడితో ఉగాది వేడుకలు నిర్వహింప చేసి తన వీరవిధేయత చాటుకుని… విమర్శల పాలయ్యారు
తుమ్మలకుంట వాసులతో ఆత్మీయ సమావేశం
వైసీపీలో అనేక సమస్యల పరిష్కార కర్తగా… జగన్ రెడ్డి కుటుంబానికి తలలోని నాలుక లాంటి వాడిగా చెవిరెడ్డికి పేరుంది. అలాంటి నాయకుడికి పార్టీ ఓడిపోయాక ఏదో కష్టం వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే అందరితో తనకెందుకు తన బాధను తన సొంత గ్రామస్తులతో చెప్పుకుంటే చాలు అనుకున్నాడో లేక …మరో కారణమో కాని.. అర్జంట్గా చంద్రగిరి సెగ్మెంట్లోని తన స్వగ్రామం తుమ్మలకుంట వాసులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వారి ముందు తన ఆదేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నంత కాలం చొక్కా చేతులు మడిచి మరీ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ బీరాల పలికిన ఆయన కళ్లు ఈ సందర్భంగా చెమర్చడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పనిలో పనిగా నేను వదిలేసి పోతే మీ పరిస్థితి ఏంటని ఆయన గ్రామస్తులను ఎమోషన్ బ్లాక్మెయిల్ చేసి తన ఒరిజినాల్టీ బయటపెట్టుకున్నారు
వైసీపీకి పిల్లర్లా వ్యవహరించిన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొందరు నేతలు ఏపిలో వైసీపీకి పిల్లర్స్ లాంటి వారని చెప్పవచ్చు . అలాంటి వారిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరు. 2014లో టీడీపీలోని అనైక్యతతో చంద్రగిరిలో సొంత సామాజికవర్గం గల్లా అరుణకూమారిని వ్యతిరేకించడంతో చెవిరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2019లో జగన్ గాలిలో సునాయస విజయం సాధించారు. అయితే మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గం వ్యాప్తంగ పండుగలకు తాయిలాలు పంచడంతో పాటు ఇంటింటికి శుభాకాంక్షలు వెళ్ళేవి. దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ రాక ముందే తానే నియోజకవర్గంలో అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మంత్రాంగం సాగించారు. అలా అన్నీ కలిసి వచ్చి 2019లోఆయన భారీ మెజార్టీతో గెలవగలిగారు.
తుమ్మలగుంట చెరువుపూడ్పించి తుడా నిధులతో నిర్మాణాలు
ఎన్నికల తర్వాత శాసన సభ విప్తో పాటు తుడా చైర్మన్ పదవి అయనకే దక్కింది. అప్పటికే ఆ పదవి మీద ఆశలు పెట్టుకున్న వైసీపీ నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా జగన్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఏమి చేయలేని పరిస్థితి . తుడా పదవిని అడ్డంపెట్టుకుని చెవిరెడ్డి పెద్ద తతంగమే నడిపారు. తన గ్రామ సమీపంలోని తుమ్మలగుంట చెరువును సగానికిపైగా పూడ్పించి.. తుడా నుంచి 60 కోట్లు పైగా ఖర్చు పెట్టి అత్యాధునిక వాకింగ్ ట్రాక్తో పాటు, అనేక విధాలుగా అభివృద్ది చేసారు. చెరువును పూడుస్తున్నా చెవిరెడ్డి హవా చూస్తూ ఇరిగేషన్ శాఖ వారు నోరెత్తలేకపోయారంటారు.
రూ.కోట్లు ఖర్చుపెట్టి ఇష్టారాజ్యంగా బెంచీల ఏర్పాటు
తుడా పరిధిలో ఇష్టా రాజ్యంగా బెంచీల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి, ఆ బల్లలపై తన పేరు వేయించుకుని చెవిరెడ్డి చేసిన ప్రచార అర్భాటం ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. దానికితోడు రహాదారులకు సైతం వైఎస్తో పాటు తన పేరు పెట్టుకున్న ఘనత ఆయనది. తుడా అనేది కేవలం చంద్రగిరి నియోజకవర్గం వరకే అన్నట్లు పాలన సాగించారు. తుడా నిధులతో సొంత సర్వే టీములకు, వ్యక్తిగత సిబ్బందికి జీతాలు ఇప్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి. వాటితో పాటు అనేక రకాలుగా తుడా నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగాలున్నాయి.
తుమ్మలగుంటపై గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదులు
తుడా నిధులతో తుమ్మల గుంట చెర్వులో ఏర్పాటు చేసిన పార్కుపై ఇప్పటికీ వివాదాలు నడుస్తున్నాయి. పూర్వం చెరువు ఏలాగుందో అలా ఉంచాలని చాలామంది గ్రీన్ ట్రిబ్యునల్కు వెళ్ళారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ అదేశాలతో అవిలాల చెరువును యాధావిధిగా ఉంచడానికి టీటీడీ ఇరిగేషన్ శాఖ అందులో ఉన్న నిర్మాణాలు తొలగిస్తోంది. ఇదే పరిస్థితి తుమ్మల గుంట చెరువులో ఏర్పాటు చేసిన పార్క్కు కూడా పట్టే కాలం దగ్గరలో ఉందని అంటున్నారు.
ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన చెవిరెడ్డి
ఎన్నికలలో ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చెవిరెడ్డి. మరో వైపు చంద్రగిరిలో తన కూమారుడు మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా రంగంలో దించారు. మోహిత్ బారీ తేడాతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. మోహిత్రెడ్డి పొలిటికల్ ఎంట్రీ సందర్బంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి తిరుపతిలోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో భారీ సభ ఏర్పాటు చేసారు. తన రాజకీయ గురువు భూమన కరుణాకరరెడ్డితో పాటు రోజా, పెద్దిరెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి వారినందర్నీ పిలిపించి మరీ హడావుడి చేశారు. దాంతో పాటు నియోజకవర్గంలో ఇంటింటికీ కుక్కర్లు పంపిణీ చేయించారు. మరో వైపు కరోనా సమయంలో అనందయ్య మందుతో హాడావుడి చేశారు.
ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలపై సీఐడి విచారణ
అయితే చెవిరెడ్డి ఎంత చేసినా పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్ను దూరం పెట్టారన్న విమర్శలు ఉన్నాయి. దానికి తోడు పార్టీ అధికారంలో లేనప్పుడు అందరినీ పేరుపేరునా పలకరించిన చెవిరెడ్డి పార్టీ అధికారం రాగానే ప్రజలతో పనిలేదన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు పలు కేసులు, వివాదాలు ఆయన్ని చుట్టుముడుతున్నాయి. ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదుతో సీఐడీ కేసులు పెట్టి విచారిస్తోంది. తుడా నిధల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. దాంతో పాటు పోలింగ్ తర్వాత పులివర్తి నానిపై పద్మావతి మహిళ యూనివర్సిటిలో జరిగిన దాడికి సంబంధించి హత్యాయత్నం కేసుల విచారణ సాగుతోంది
తుమ్మలగుంట పార్క్ను సొంత ఆస్తిలా భావించిన చెవిరెడ్డి
వాటితో పాటు తుమ్మలగుంట చెరువులో ఉన్న పార్క్ను ఇప్పటి వరకు చెవిరెడ్డి తన సొంత ఆస్తిలా భావిస్తూ వచ్చారంట. ఇప్పుడు దాన్ని తుడా నిర్వహణలో తీసుకోవాలని పై స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పావులు కదపడం మొదలు పెట్టారంట.గ్రామంలోని వారందరితో అత్యవసర అత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను అందర్నీ బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నా, తన బిడ్డని ఓడించారంటూ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారంట. దాంతో పాటు పార్క్ను తుడా నిర్వహిస్తే దారుణంగా మారిపోతుందని దాని కోసం పోరాటం సాగిద్దామని పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా మారింది.
Also Read: ముధోల్లో ఆధిపత్య పోరు
హీథీరాంజీ మఠం భూములలో ఇల్లు కూల్చివేత
పార్క్ కట్టిన చెరువు ఇరిగేషన్ శాఖది, అయితే నిధులు తుడావి అయినప్పుడు నిర్వహణ వారిద్దరు చేయాలి కాని తన పరిధిలో ఉంచుకోవాలని ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద సొంత అస్తి కోల్పోతున్నట్లు చెవిరెడ్డి తెగఇదై పోతున్నారని అందరూ సెటైర్లు విసురుతున్నారు. పక్కనున్న హాథీరాంజీ మఠం భూములలో గ్రామస్తులు కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు వాటిని చెవిరెడ్డి కూల్చి వేయించారు. ఇప్పుడు తన దాక వచ్చే సరికి నొప్పి తెలుస్తోందని గ్రామస్తులు దెప్పిపొడుస్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి కన్నీటి ఎపిసోడ్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.