LPG e-KYC: e-KYC పూర్తి చేయలేకపోయిన డొమెస్టిక్ LPG వినియోగదారులకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ఆగస్టు 23 గడువు ముగియడంతో చాలా మంది వినియోగదారులు టెన్షన్ పడ్డారు. అయితే ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి ఈ నెల ఆగస్టు 31 వరకు ఆయిల్ కంపెనీలు గడువు పెంచాయి. తెలంగాణలో ఇప్పటివరకు దాదాపు 82 శాతం మంది ఈ-కేవైసీ పూర్తి చేశారు. రోజుకు 20 వేల నుంచి 30 వేల మంది ఏజెన్సీలకు పోటెత్తుతున్నారు. జనం ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ఈ రష్ తగ్గించేందుకు గడువు పొడిగించింది.
Also Read: ఆర్ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!
భవిష్యత్తులో గ్యాస్ సబ్సిడీ నిలిచిపోకుండా ఉండాలన్నా… సిలిండర్ డెలివరీలో ఎలాంటి అంతరాయం కలగకూడదన్నా ప్రతీ ఒక్కరూ ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఆన్ లైన్ లేదా సమీపంలోని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని లబ్ధిదారులు ఈ చివరి అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఆగస్టు 31లోగా వెంటనే మీ సమీప గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.