E-Paper
Advertisement

భట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ.. వేటు పడినట్టేనా..!

భట్టి విక్రమార్కతో కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి భేటీ.. వేటు పడినట్టేనా..!
Advertisement

Konda Surekha: ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో.. మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి భేటీ అయ్యారు. ఆసమయంలోనే భట్టి దగ్గరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వచ్చారు. భట్టి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమక్షంలో వేర్వేరుగా జరిగిన భేటీలు పొలిటికల్ హీట్ పెంచాయి.

సురేఖపై వేటు తప్పదా..?

ఇక్కడే అసలు సస్పెన్స్ మొదలైంది. కొండా సురేఖ పార్టీ నియమావళిని ఉల్లంఘించడం ఇది మూడోసారి అని.. చిన్నారెడ్డి కూడా హద్దులు దాటి మాట్లాడారని పీసీసీకి కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ.. నివేదిక ఇచ్చింది. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని DAC సూచించడంతో కొండా సురేఖపై వేటు తప్పదా..? అన్న చర్చ ఊపందుకుంది. సరిగ్గా ఇదే సమయంలో కొండా మురళి.. భట్టి విక్రమార్కను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నారు కొండా మురళి. గాంధీ కుటుంబంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని.. కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని క్లారిటీ ఇచ్చారు కొండా మురళి.

Advertisement

Also read: మహిళల దుస్తులపై తీర్పులు.. ఆ దుస్తుల్లో రాఖీ కట్టడం ఏంటని కంగనా ఫైర్!

గతంలో పార్టీకి..

కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకుంటే.. గతంలో పార్టీకి ఇబ్బందికరంగా వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్‌రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ రావొచ్చన్న ప్రచారం ఉంది. మరి అందుకే ముందస్తుగా భట్టిని రాజగోపాల్‌ రెడ్డి కలిసి తన వాదన వినిపించారా..? అని చర్చ మొదలైంది. అయితే.. రాజగోపాల్‌రెడ్డి మాత్రం రాజకీయ భేటీ కాదని క్లారిటీ ఇచ్చారు. పెండింగ్ బిల్లులు, అభివృద్ధి పనుల గురించే భట్టితో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ నివేదిక.. మరోవైపు నేతల వరుస భేటీలు.. ఇంకోవైపు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూపులు. కాంగ్రెస్‌లో యాక్షన్ ఎప్పుడు మొదలవుతుందన్నదే ఇప్పుడు అసలు సస్పెన్స్.

Advertisement

Also read: నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

Tags

Related News

ఈ-కేవైసీపై సర్కార్ సంచలన నిర్ణయం.. గ్యాస్ వినియోగదారులు వెంటనే ఇలా చేయండి!

స్థానిక పోరుకు సిద్ధమవుతున్న ఏపీ.. బీసీ కోటా చుట్టూ తిరుగుతున్న గరం గరం రాజకీయం!

ఆర్‌ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!

ఇథనాల్ బ్లెండింగ్ వల్లే చక్కెర రేట్లు పెరిగాయా.. ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీ ఇదే!

జనాభా లెక్కలపై కాంగ్రెస్ రాజకీయం.. కేంద్ర విధానంపై తీవ్ర గరం గరం!

అమెరికా వర్సెస్ కెనడా ట్రేడ్ వార్.. పెరగనున్న నిత్యావసర ధరలు!

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం.. ఇక అందరి చూపు అటువైపే!

Big Stories

Advertisement
×