Cabinet Reshuffle: బీజేపీ కొత్త ఆఫీస్ బేరర్ల టీమ్ లో 65 మందిలో 51 మంది కొత్తవారే ఖరారైన తర్వాత… ఇప్పుడు ఫోకస్ కేబినెట్పైకి మళ్లింది. ప్రస్తుత మంత్రివర్గంలో ప్రధానితో కలిపి 70 మంది ఉండగా… రాజ్యాంగం అనుమతించే గరిష్ఠ సంఖ్య 81. అంటే 11 బెర్తులు ఖాళీ ఉన్నాయ్. 2029 లోక్సభతో పాటు వచ్చే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యువత, మహిళలు, మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఉండొచ్చన్నది ఢిల్లీ వర్గాల అంచనా.
Also Read: ఈనెల 30న తెలంగాణకు సునీల్ బన్సల్.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఇక గడ్కరీ కొత్త తరానికి బాధ్యతలు ఇవ్వాలన్న వ్యాఖ్యలు కలకలం రేపినా.. ఆయన కార్యాలయం అది రాజకీయాలపై కాదని, ట్రస్ట్ బాధ్యతల గురించేనని స్పష్టం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్, రవ్నీత్ సింగ్ బిట్టూ రాజీనామాలు చేశారు. సో క్యాబినెట్ రీ షఫుల్ విషయంలో మిత్రపక్షాలను సంతృప్తిపరచడమా ఎన్నికల లెక్కలా పనితీరు సమీక్షలా? ఇవన్నీ చర్చకు వస్తున్నాయ్. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల నుంచి మరింత మందికి ఛాన్స్ ఉండబోతోందా?