Sugar Prices: జులై 20న కిలో చక్కెర సగటు ధర 48 రూపాయలు. ఆగస్టు 20కి అది 60 రూపాయలు దాటింది. ప్రస్తుత సీజన్లో చక్కెర ఉత్పత్తి తొలుత అంచనా వేసిన 343 లక్షల టన్నుల నుంచి సుమారు 306 లక్షల టన్నులకు పడిపోవచ్చని కేంద్రం చెబుతోంది. తెగుళ్లు సహా రకరకాల కారణాలు చెరకు దిగుబడిని దెబ్బతీశాయ్. ఇథనాల్ బ్లెండింగ్ కు వాడుతుండడం ఈ చక్కెర రేట్లు పెరిగేలా చేసిందా అన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం కాదు అంటోంది. ఇథనాల్కు మళ్లించే చక్కెర వాటా 2022-23లో 12 శాతం నుంచి 2025-26లో 9 శాతానికి తగ్గిందని చెబుతోంది.
Also read: జనాభా లెక్కలపై కాంగ్రెస్ రాజకీయం.. కేంద్ర విధానంపై తీవ్ర గరం గరం!
మరి ధరలు ఎందుకు పెరిగాయి? తక్కువ ఉత్పత్తి, పండుగల ముందు పెరుగుతున్న డిమాండ్, ప్రపంచ మార్కెట్లో సరఫరా ఒత్తిడి, ఊహాగానాలు, నిల్వదారుల పాత్ర… ఇవన్నీ కలిసి చక్కెర రేట్లపై ఎఫెక్ట్ చూపుతున్నాయ్. ఉత్పత్తి తగ్గిన టైంలో ఇథనాల్ కు షిఫ్టింగ్ కూడా సమస్యే. సమస్య తీవ్రత పెరిగిన చాలా రోజులకు ప్రభుత్వం ఇప్పుడు లక్ష టన్నుల డ్యూటీ ఫ్రీ షుగర్ దిగుమతులకు అనుమతించింది. సంక్షోభం వచ్చాక చర్యలు తీసుకోవడమేనా… ముందస్తు సరఫరా ప్రణాళిక ఎక్కడ? అన్న ప్రశ్నలు వస్తున్నాయ్.