Renigunta Railway Junction: 164 ఏళ్ల కాలప్రవాహంలో ఎందరో కలలను, కన్నీళ్లను, ఆనందబాష్పాలను నిశ్శబ్దంగా వీక్షించిన మూగసాక్షి.. రేణిగుంట రైల్వే జంక్షన్. కాలం మారింది.. రైళ్ల రూపం మారింది.. రైల్వే మార్గాలు విస్తరించాయి.
బ్రిటిష్ పాలనలో ఒక చిన్న రేకుల షెడ్డులో కేవలం 10మంది సిబ్బందితో మొదలైన చిన్న రైల్వే స్టేషన్.. ఇప్పుడు 5 ప్లాట్ఫామ్లతో, ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ, ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, సురక్షితమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలతో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలను అందిస్తోంది.
1862 ఆగస్టు 27న మొదలైన రైల్వే ప్రయాణం
సరిగ్గా 1862 ఆగస్టు 27న రేణిగుంటలో రైల్వే కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం రెడ్డిపల్లి, కడప వైపు రైల్వే మార్గాలు విస్తరించడంతో రేణిగుంట ప్రాధాన్యత మరింత పెరిగింది. 1892లో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఇక్కడ స్టీమ్ లోకోమోటివ్ షెడ్ ఏర్పాటు చేశారు.
also read :లక్కీ డ్రాలో అదిరిపోయే ట్విస్ట్.. టోకెన్ తీసిన చిన్నోడికే ఇల్లు!
ఆవిరి ఇంజిన్ల కాలంలో రేణిగుంట రైల్వే కార్యకలాపాలకు ఇది మరింత ఊపునిచ్చింది. అలా.. చిన్న స్టేషన్ కాస్తా ఎన్నో జీవితాల ప్రయాణంలో విడదీయలేని జ్ఞాపకంగా మారింది.
తిరుమల భక్తులకు కీలకమైన రైల్వే మజిలీ
అంతేకాదు రేణిగుంట అంటే కేవలం రైళ్ల రాకపోకలు కాదు.. ఎంతోమంది జీవితాల కథల్లో ఓ మధురమైన మజిలీ. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు..ఇక్కడ రైలు దిగి తిరుమల బాట పడుతుంటారు.
also read :మంత్రి పదవిని కాపాడుకునేందుకే రాఖీ అస్త్రమా.. కాంగ్రెస్లో కొండా సురేఖ నయా స్ట్రాటజీ!
అదే సమయంలో.. పాలు, ఎరువులు, రేషన్ బియ్యం వంటి సరకు రవాణాలోనూ రేణిగుంట కీలక పాత్ర పోషిస్తోంది. ప్రయాణికుల ప్రయాణం నుంచి ప్రాంత ఆర్థిక కార్యకలాపాల వరకు రేణిగుంటతో ముడిపడిన అవసరాలెన్నో, అనుబంధాలెన్నో.