BC Politics: బీసీలే టార్గెట్గా టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత స్వర్గీయ ఎన్టీఆర్దేనని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ అన్నారు. ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన బీసీ సాధికారతను చంద్రబాబు కొనసాగిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం సంతోషకరమన్నారు. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు బీసీలను రాజకీయంగా ప్రోత్సహించింది టీడీపీనేనని స్పష్టం చేశారు.
బీసీలను చంద్రబాబు మోసం చేశారు
బీద రవిచంద్ర వ్యాఖ్యలకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీసీలను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. విమర్శలు చేశారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, పదవులు ఇచ్చిన ఏకైక సీఎం జగన్ అని అనిల్ అన్నారు. జగన్ హయాంలో బీసీకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చామన్నారు.
also read :నల్లాలు విప్పితే కంపుకొట్టే మురుగునీరు.. చందానగర్లో తాగునీటి కష్టాలపై ప్రజల నిరసన!
ప్లేస్, టైమ్ చెప్పండి.. వచ్చేస్తా
బీద రవిచంద్ర విసిరిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించడం ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. 1998 నుంచి బీసీలకు ఎవరు ఏం చేశారు..? జగన్ చేసిన మేలు ఏంటి..? ప్లేస్, టైమ్ చెబితే చర్చకు సిద్ధం అంటూ అనిల్ సవాల్ చేశారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లింది టీడీపీ వాళ్లు కాదా అని ప్రశ్నించారు.
also read :లక్కీ డ్రాలో అదిరిపోయే ట్విస్ట్.. టోకెన్ తీసిన చిన్నోడికే ఇల్లు!
బీసీ కార్డు చుట్టూ నెల్లూరు పాలిటిక్స్
బీద రవిచంద్ర సవాల్కు అనిల్ కుమార్ యాదవ్ సై అనడంతో.. మాటల యుద్ధం బహిరంగ చర్చకు దారితీస్తుందా? లేక బీసీ కార్డు చుట్టూ రాజకీయ వేడి మరింత పెరుగుతుందా? ఇప్పుడు అసలు ఆసక్తి అంతా నెల్లూరు పాలిటిక్స్పైనే ఉంది.