Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ తెరపైకి వచ్చింది. మంత్రి పదవి ఊడిపోతుందనే తీవ్ర ఊహాగానాల వేళ.. మంత్రి కొండా సురేఖ నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం, ఆయనకు స్వయంగా రాఖీ కట్టడం రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మలుపు తిరిగాయి. కొండా కుటుంబానికి.. సీఎం రేవంత్రెడ్డికి మధ్య పరకాల సీటు వ్యవహారం విభేదాలకు దారితీసింది.
అదే సమయంలో సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ సీఎం రేవంత్పై చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్లో కలకలం రేపాయి. దీంతో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తారన్న ప్రచారం జోరందుకుంది. రాష్ట్ర నాయకత్వం అధిష్టానానికి నివేదిక కూడా పంపించారు. రేపోమాపో యాక్షన్ తప్పదని గాంధీభవన్లో రీసౌండ్ వినిపించింది. సడెన్గా రాఖీ పండుగ వేళ సీఎం రేవంత్ నివాసానికి కొండా సురేఖ వెళ్లి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, పరకాల సీటు వివాదంపై ఇద్దరి మధ్య కాసేపు చర్చ జరిగింది. గతంలో కొండా సుష్మిత విమర్శలు చేసినప్పుడు కొండా సురేఖ సారీ చెప్పి.. గొడవకు పుల్స్టాప్ పెట్టారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా? కానీ కొండా ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలపై అధిష్ఠానం ఆగ్రహంతో ఉంది. కేసీ వేణుగోపాల్ ఫారెన్ టూర్ ముగించుకొని ఢిల్లీకి రిటర్న్ అయ్యాక కొండా ఎపిసోడ్పై నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
Also read: ప్రేమ కోసం అలాంటి పని… ఇంట్లో పెద్ద గందరగోళంతో ఫుల్ ఫన్… మస్ట్ వాచ్ రొమాంటిక్ కామెడీ డ్రామా