Contaminated Water: గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ పాపిరెడ్డి కాలనీలో కలుషిత తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. వర్షాలతో నల్లా నీటిలో మురుగు కలవడంతో పాటు తీవ్రమైన దుర్వాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. తాగునీటిని ఉపయోగించుకోలేక బయటి నుంచి వాటర్ క్యాన్లు కొనుగోలు చేసుకుంటున్నారు.
పైపులైన్లలో ఏర్పడుతున్న లీకేజీల కారణంగానే వర్షపు నీరు, మురుగునీరు తాగునీటి సరఫరా లైన్లలోకి చేరుతున్నట్లు స్థానికంగా ఆరోపణలు చేస్తున్నారు. కలుషిత నీటిని తాగి ఇప్పటికే చిన్నారులు, వృద్ధులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.
Also read: క్షుద్రపూజల రచ్చ.. కవిత రాజకీయ వ్యూహమేంటి?
వర్షాకాలం ముందే పైపులైన్ల లీకేజీలను గుర్తించి మరమ్మతులు చేపట్టాల్సిన యంత్రాంగం, సమస్య తీవ్రత పెరిగిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా జలమండలి అధికారులు స్పందించి, స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Also read: వరల్డ్ బ్యాంక్లో జాబ్ కావాలా? ఇదిగో లక్కీ ఛాన్స్