Jagan Assembly: సీఎం సీటు దూరం కాగానే.. తెలంగాణలో కేసీఆర్. ఏపీలో జగన్ అసెంబ్లీలో అడుగు కూడా పెట్టడం లేదు. తెలంగాణలో కేటీఆర్, హరీశ్రావు పార్టీ గొంతును గట్టిగానే వినిపిస్తున్నారు. మరీ ఏపీ శాసనసభలో వైసీపీ వాయిస్ ఎక్కడ? త్వరలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.
ఈసారి సభకు వెళ్దాం ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీద్దామని కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారట. కానీ అధినేత నుంచి మాత్రం మౌనమే సమాధానమవుతోంది. మొదట్లో జగన్ సభకు వెళ్లి జస్ట్ కూర్చుని వచ్చేవారు. ఇప్పుడు అసెంబ్లీ గేటు బయట కారు కూడా ఆపడం లేదట. ఇలా అయితే లక్షలాది మంది ప్రజల గొంతు అసెంబ్లీలో వినిపించేదెవరు?
Also Read: పోలీసుల షాక్.. జగన్కు నో ఎంట్రీ!
మరోవైపు సభకు రండి ఏ అంశమైనా చర్చిద్దామంటూ అధికార టీడీపీ సవాల్ విసురుతోంది. విమర్శలు, ఆరోపణలు మీడియా మైకుల ముందే కాదు. సభలోనూ వినిపించాలని అంటోంది. కూటమి నేతల సవాల్ను జగన్ స్వీకరిస్తారా? ఐనా ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చింది కేవలం బయట మాట్లాడడానికే కాదు. చట్టసభల్లో ప్రజా గొంతుక వినిపించడానికి. మరి జగన్ తన వైఖరి మార్చుకుని అసెంబ్లీకి వస్తారా? ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా?
Also Read: బ్లూ అవుట్.. ఆరెంజ్ ఇన్.. హాకీ జెర్సీ పై రాజకీయ రచ్చ!