Jagan Visit: పాలిటిక్స్లో టైమింగ్ ఎంత ముఖ్యమో టైమ్ కూడా అంతే ముఖ్యం. శ్రీకాకుళం జైలులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు వెళ్లారు జగన్. కానీ.. పరామర్శించలేకపోయారు. ఎందుకంటే విశాఖ నుంచి జగన్ చాలా ఆలస్యంగా శ్రీకాకులం చేరుకున్నారు.
అప్పలరాజును పరామర్శించేందుకు జగన్ వస్తున్నారని వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. నేతలతో కలిసి హుషారుగా ర్యాలీ తీశారు జగన్. ఈ క్రమంలో ఓ మహిళా ఎస్సైతో వైసీపీ నేతలు దురుసుగా ప్రవర్తించడం విమర్శలకు దారితీసింది.అంపోలులో జైలు దగ్గరకు చేరుకునే సరికి ములాఖత్ టైమ్ అయిపోయింది.
Also Read: జగపతిబాబు మొహానికి సర్జరీ..? అసలు ఏమైంది..!
జైలు రూల్స్ ప్రకారం జగన్కు అనుమతి నిరాకరించారు. దాంతో చేసేదేమీ లేక జైలు బయటే సీదిరి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రెస్ మీట్ పెట్టి, కూటమి ప్రభుత్వంపై తన స్టైల్లో విమర్శలు చేశారు. జగన్ టూర్, వైసీపీ తీరుపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. పరామర్శకు కూడా ఇంత హంగామా అవసరమా అని ప్రశ్నించారు.
Also Read: లంచం ఇస్తేనే పని జరుగుతుందా.. ఏపీలో అవినీతికి అడ్డులేదా..!