HIV Students: చదువుకోవాల్సిన కాలేజీ గోడల మధ్య ఇప్పుడు నిశ్శబ్ద రోదనలు వినిపిస్తున్నాయి. హెచ్ఐవీ మహమ్మారి కాలేజీ క్యాంపస్ గుమ్మాలను దాటింది. ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాల్సిన విద్యార్థులకు హెచ్ఐవీ టెస్ట్లు చేస్తే పాజిటివ్ వస్తోంది. తాజాగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ నివేదికలో భయంకర నిజాల్ని చూసి దేశం ఉలిక్కి పడుతోంది.
కర్ణాటక రాష్ట్రంలో 7 వేల మందికి పైగా విద్యార్థులు హెచ్ఐవీ బారిన పడ్డరన్న నిజం. కన్నతల్లుల గుండెలను ముక్కలు చేస్తోంది. పుస్తకాలు ఉండాల్సిన చేతుల్లోకి మందు బిళ్లలు వచ్చాయి. కాలేజీ మెట్లు ఎక్కాల్సిన ఏజ్లో ఆస్పత్రి బెడ్స్ ఎక్కుడుతున్నారు. ఏ తప్పు చేశారో, ఎక్కడ పొరపాటు జరిగిందో కూడా తేరుకోలేని వయసులో వాళ్లంతా నాలుగు గోడల మధ్య కుమిలిపోతున్నారు. నలుగురిలో తిరగలేక, ఎవరికీ చెప్పుకోలేక, తల్లిదండ్రుల కళ్లలోకి చూడలేక ఆ బిడ్డలు పడుతున్న యాతన వర్ణనాతీతం.
Also Read: ప్రియాంక జైన్ షాకింగ్ సాంగ్.. అందాల విందుపై నోరెళ్లబెట్టిన ఫ్యాన్స్, ఇదిగో వీడియో!
బాధితుల్లో ఎక్కువమంది డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న యువతీ యువకులే ఎక్కువగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ దారి తప్పుతున్నారా? లోకజ్ఞానం లేక నూరేళ్ల జీవితాన్ని అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. మరి ప్రభుత్వ వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? అవగాహన కల్పించాలన్న సోయి కూడా లేదా?
Also Read: బ్లూ అవుట్.. ఆరెంజ్ ఇన్.. హాకీ జెర్సీ పై రాజకీయ రచ్చ!