AP Corruption: ఇది విపక్షాలు చేసే రాజకీయ విమర్శ కాదు. ప్రతిపక్షాలు చల్లే బురద అంతకంటే కాదు. అధికారంలో ఉన్న సొంత నేతలే గుండెలు బాదుకుంటున్న ఆక్రోశం. ఏపీలో అధికార పీఠాలు మారినా.. పాలకులు మారినా.. అదే అవినీతి.. అదే ఆనవాయితీ. పాలకులు మారారు. పరిపాలన మారింది. కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి మరకలు అలానే ఉన్నాయి. లంచాల దందా మారడం లేదు. దొంగ రిజిస్ట్రేషన్లు ఆగడం లేదని స్వయంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆవేదనతో రగిలిపోతున్నాడు. పోలీసులు కూడా అవినీతికి అలవాటుపడి చర్యలు తీసుకోవడం లేదని వరదరాజులరెడ్డి వర్రీ అవుతున్నారు.
ఎమ్మెల్యే ఆవేదన ఒకెత్తయితే.. మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో వెళ్లగక్కిన బాధ మరీ ఘోరం. తాను చెప్పినా.. అధికారులు వినడం లేదని పనులు చేయడం లేదని గతంలో మండిపడ్డారు. ఐనా అధికారుల్లో మార్పు రాకపోవడంతో జిల్లా ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి అవినీతి అధికారులకు చివాట్లు పెడుతున్నారు. మంత్రి వస్తేనే పనులు చేస్తారా అంటూ ఓ రేంజ్లో ఫైరయ్యారు.
Also Read: ఇది ఏపీకి దక్కిన గౌరవం అంటూ.. ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పోస్ట్ వైరల్..!
నిజానికి మంత్రి, ఎమ్మెల్యే చేసినవి వంటి విమర్శలు కావు, వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతి కుళ్లుకు సజీవ సాక్ష్యాలు. అధికారం చేతిలో ఉన్నవారే ఇలా ఆవేదనతో రగిలిపోతుంటే.. అసలు ఏపీలో నడుస్తోంది ప్రజా పాలనా? లేక అధికారుల రాజ్యమా? అనే అనుమానం వస్తోంది. ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకునేది. మార్పు కోసం.. కానీ పాత అవినీతి దందాలు పాతుకుపోతే.. ప్రజల విశ్వాసానికి న్యాయం ఏం జరిగినట్టు?
Alao Read: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. ఎవరి వ్యూహం ఫలిస్తుంది?