Venu Swamy Comments on Bigg Boss: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యకంగా పరిచయం అవసరం లేదు. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై జోస్యం చెప్పి ఆయన వైరల్ అయ్యారు. ముఖ్యంగా నాగ చైతన్య, సమంత పెళ్లిపై విషయంలో ఆయన చెప్పిన జోస్యం నిజం అవ్వడంతో వేణు స్వామి లైమ్ లైట్లోకి వచ్చాడు. అప్పటి నుంచి వేణు స్వామిలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. ఇటీవల నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం తర్వాత ఆయన వారి వ్యక్తిగత జీవితంపై చేసిన కామెంట్స్ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై పోలీసు కూడా నమోదైంది. అక్కినేని ఫ్యాన్స్ నుంచి వార్నింగ్లు రావడంతో వేణు స్వామి వైరల్ అయ్యాడు.
అంతేకాదు నాగ చైతన్య, శోభితలకు కూడా క్షమాపణలు చెబుతూ.. ఇకపై ఏ సెలబ్రిటీ గురించి తాను జ్యోతిష్యం చెప్పనని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి సైలెంట్ అయిన వేణు స్వామి తాజాగా ఓ షాకింగ్ వీడియో పెట్టారు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ షోకి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఓ వీడియో విడుదల చేశాడు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్కు తీవ్ర వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత నుంచి బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటే డిమాండ్స్ వస్తున్నాయి. బూతులు తిట్టి ఒకరిని బాధపెట్టిన అమ్మాయి. ఒకరి కాపురంలో చిచ్చు పెట్టి అక్రమ సంబంధం పెట్టుకున్న వారిని బిగ్ బాస్కి తీసుకువచ్చిన సామాజానిక ఏం మెసేజ్ ఇస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నాయి.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
బిగ్ బాస్ను బ్యాన్ చేయడంపై ఆయన స్పందించాడు. దీనిపై వేణు స్వామి తనదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు. “బిగ్ బాస్ బ్యాన్ చేయాలని అనడానికి కారణం దివ్వెల మాధురి, రీతూ చౌదరి, అలేఖ్యా చిట్టి పిక్కిల్స్ రమ్య. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు వింత పోకడ పోతున్నాయి. సోషల్ మీడియా.. మీడియా మెయిన్ స్ట్రీమ్ వల్లే వారు సెలబ్రిటీలు అయ్యారన్నారు. అలేఖ్యా చిట్టి పిక్కల్స్, దివ్వెల మాధురి, రీతూ చౌదరిలు సోషల్ మీడియా, మీడియా వల్లే సెలబ్రిటీలు అయ్యారన్నారు. అసలు అలేఖ్యా పిక్కిల్స్ అనే పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలుసా? ఆ పేరు అందరికి తెలిసేలా చేసింది ఎవరూ సోషల్ మీడియా, మీడియా ఛానళ్లే. దివ్వెల మాధురి ఎరికైనా తెలుసా. ఆమె వ్యక్తిగత జీవితాన్ని బయటకు లాగి అక్రమ సంబంధం, రంకు పెట్టుకుందంటూ రెండు మూడు నెలలు టైం పాస్ చేసింది ఎవరూ.
Also Read: Madhuri-Thanija: ఇక ఆపు నేను భరించలేను.. తనూజకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన మాధురి
ఈ మీడియానే. తన బతుకు తన బతుకుతున్న ఆమెను బయటకు లాగి సెలబ్రిటీ చేసింది వీరే. ఇలా బయట వారి జీవితాలను నాశనం చేయాలని చూసిన వారిని.. బిగ్ బాస్ హౌజ్లోకి తీసుకువచ్చి వారిని సెలబ్రేట్ చేసింది. ఈ విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఈ రచ్చ చేస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియా, మీడియా వల్ల తెలుగు రాష్ట్రాలు వింతపోకడ పోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో బిగ్ బాస్ టీం వీరికి ఎప్పుడు కృతజ్ఞతతో ఉండాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీకు కంటెస్టెంట్స్ ని ఇస్తుంది వీరే. వీరు టార్గెట్ చేసిన వారు సెలబ్రిటీలు అవుతున్నారు. కాబట్టి మీడియా, సోషల్ మీడియాకు బిగ్ బాస్ టీం థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరో విషయం వీరు టార్గెట్ చేస్తున్నారంటే సంతోషించాల్సిన విషయమే. ఎందుకంటే ఎప్పుడు మీడియా, సోషల్ మీడియాలో మీరు టార్గెట్ అవుతారో అప్పుడే మీ జీవితం మారుతుందని అర్థం“