Bigg Boss 9 : తెలుగు బిగ్ బాస్ యాజమాన్యం తనిజాకి సపోర్ట్ చేస్తుంది అని క్లియర్ గా చాలా మందికి అర్థమైపోయింది. గతంలో కూడా చాలామంది ఇదే విషయాన్ని ప్రస్తావించారు. బయట వాళ్ళు ప్రస్తావించడం మాత్రమే కాకుండా హౌస్ లో కొన్ని రోజులు ఉండి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఈ విషయాలని చెప్పారు. కామనర్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చింది రమ్య మోక్ష. రమ్య చెప్పిన విషయాలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. బిగ్ బాస్ యాజమాన్యం తనకు ఎంతలా సపోర్ట్ చేస్తుందో వివరించేసింది రమ్య.
మరోవైపు శ్రీజ దమ్ము కూడా చాలా ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. తనకు మేనేజ్మెంట్ ఎంతలా సపోర్ట్ చేస్తుందో రివీల్ చేసింది. అయితే తనుజను ఎవరెవరు టార్గెట్ చేస్తున్నారో వాళ్ళందర్నీ కూడా టార్గెట్ చేస్తుంది బిగ్ బాస్ యాజమాన్యం. ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో చూస్తుంటే కచ్చితంగా బిగ్ బాస్ యాజమాన్యానికి, కళ్యాణ్ టార్గెట్ గా మారుతాడేమో అనిపిస్తుంది.
ఈరోజు ఒక టాస్క్ జరిగింది ఆ టాస్క్ లో ఒకదానిపై ఒక బాక్స్ ను పేర్చాల్సి ఉంటుంది. తనుజ మరియు సుమన్ శెట్టి ఈ టాస్క్ లో పాల్గొన్నారు అయితే ఇద్దరూ కూడా ఒకదాని పైన ఒకటి పెట్టిన బాక్సెస్ ఒకే హైట్ లో ఉన్నాయి. అయితే సుమన్ శెట్టి పెట్టినవి ప్రాపర్ లైన్ లో లేవు.
టవర్ అంటే తిన్నగా ఉండాలి కాబట్టి సంజనా గారిని విన్నర్ గా ప్రకటిస్తున్నాను అని చెప్పాడు కళ్యాణ్. అలా చెప్పడంతోనే తనుజ ఒక్కసారిగా కళ్యాణ్ పైన ఆర్గ్యుమెంట్ కి దిగింది. వీరిద్దరికీ విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు ఏమంటావు అని అడిగాడు కళ్యాణ్.
అయితే తనూజ మాట్లాడుతూ నేను సుమన్ శెట్టి గారిని విన్నర్ గా అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు నేను ఇవ్వను అని మొహం మీద చెప్పేశాడు. అంటూ సంజనను విన్నర్ గా అనౌన్స్ చేసేసాడు.
తనుజాతో అంత ఆర్గ్యుమెంట్ చేశాడు కాబట్టి వీక్ ఎండ్లో నాగార్జున వచ్చి సంచాలకుగా నువ్వు తీసుకున్న డెసిషన్ తప్పు. హైట్ ముఖ్యం అంటూ నాగర్జున కొత్త స్క్రిప్ట్ ఏమైనా పట్టుకొని కళ్యాణ్ ను నిలదీయడం మొదలు పెడతారా అనే ఆలోచన చాలా మందికి మొదలైంది.
Also Read: Bigg Boss 9 : వదిలేయ్ కళ్యాణ్, సుమన్ శెట్టిని ఇందుకే ఇష్టపడతారు