Bigg Boss Seethu : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో ఇప్పటికే 9 సీజన్లు పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది.. అయితే ఈ మధ్య బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ లో జరుగుతున్న వాటి గురించి బయట పెడుతున్నారు.. ఇప్పటికే ఎంతోమంది బిగ్ బాస్ గురించి సంచల్ నాకు కామెంట్లు చేస్తున్నారు. తాజాగా సినీ నటి, బిగ్ బాస్ సీతూ ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో ఆమె బిగ్ బాస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంది.. అంతే కాదు తనకి ఎటువంటి ఆఫర్స్ రాకపోవడానికి గల కారణాలను కూడా వివరించింది.. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
చాలామంది బిగ్ బాస్ కు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఎప్పుడెఎప్పుడు ఈ ఆఫర్ తమకి వరిస్తుందో అని ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈమధ్య బయటకు వస్తున్న వార్తలు వింటే ఎవరికైనా బిగ్ బాస్కి వెళ్లాలన్న ఆలోచన కూడా రాదు. ఇది మేమంటున్నా మాట కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఇంటర్వ్యూలలో చెప్తున్న మాట.. తాజాగా ప్రముఖ యూట్యూబర్ సినీ నటి కిర్రాక్ సీత కూడా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ బిగ్ బాస్ లో జరుగుతున్న కొన్ని సంచలన విషయాలను బయటపెట్టింది. బిగ్ బాస్కొచ్చి బాగానే సంపాదించాను. కానీ ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే బిగ్ బాస్ కి వెళ్లి తప్పు చేశాను అని అనిపిస్తుంది అంటూ తన మనసులోని మాటను బయట పెట్టేసింది.. బిగ్ బాస్ వల్లే ఇప్పుడు ఏమీ ఆఫర్స్ రావడం లేదు అంటూ ఆమె అనడంతో ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read :డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేసిన మిస్టేక్ వల్లే స్టార్ హీరోలు డేట్స్ ఇవ్వడంలేదా..?
కిర్రాక్ సీత ఒక యూట్యూబర్ గా తన కెరీర్ ని మొదలు పెట్టింది.. యూట్యూబ్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయింది.. తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. పలు సినిమాలలో కూడా నటించింది.. యూట్యూబ్ వీడియోలతో బాగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ లో తన యాటిట్యూడ్ తో జనాలని బాగా ఆకట్టుకుంది.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆమె పరిస్థితి మరీ దారుణంగా మారింది అని ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. గతంలో ఉన్న కమిట్మెంట్స్ ఏవి ఇప్పుడు తన దగ్గరికి రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తుంది.. బిగ్ బాస్ కు వెళ్ళకముందు వచ్చిన 10వేలు అయినా చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈ మధ్య ఖర్చులు కూడా పెరిగాయి.. దాంతో నెలకు నేను ఈఎంఐ, అలాగే ఇంటికి సంబంధించిన లోను ఇవన్నీ కలిపి 2 లక్షలకు పైగా కట్టాలి. ఇప్పుడు ఎలా కట్టాలి అని ఆలోచిస్తున్నాను.. ఏమో ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి అంటూ కిరాక్ సీత అంటుంది. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో ఆమె గురించి నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.