Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 లో ఉన్న కంటెస్టెంట్స్ లో తనుజ ఒకరు. సీజన్ 9 లో మొదట కంటిస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లోకి ఎంటర్ ఇవ్వడంతోనే ముద్దు ముద్దు మాటలతో తన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టింది. అంతేకాకుండా కింగ్ నాగార్జునకు స్పెషల్ గా మటన్ బిర్యానీ కూడా చేసి పెట్టింది.
బిగ్ బాస్ హౌస్ లో మొదట కామన్ గా కొంతమంది నటిస్తారు అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఈ సీజన్లో కూడా అదే జరిగింది. కిచెన్ డ్యూటీ చేస్తున్న తరుణంలో ఎవరికి ఏది కావాలంటే అది వన్డే ప్రయత్నం చేసింది. తర్వాత తర్వాత ఆవిడ గురించి కంప్లీట్ గా అందరికీ అర్థమైంది. ఇప్పటికీ కూడా తనుజ నటిస్తుంది అని చాలామందికి అనిపిస్తూనే ఉంటుంది.
తనుజ ముద్దమందారం అని సీరియల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సీరియల్ చాలా కాలం కొనసాగింది. దాంట్లో ఎక్కువగా తనుజ ఏడుస్తూ ఆక్టింగ్ చేసింది. అదే యాక్టింగ్ ఇప్పుడు హౌస్ లో కూడా చేస్తుంది అని చాలామంది ఇప్పటికే కామెంట్స్ చేశారు. చాలామంది ఆడియన్స్ కి కూడా అదే ఒపీనియన్ ఉంది.
ఇక నేడు జరిగిన వీకెండ్ ఎపిసోడ్ కి నాగచైతన్య గెస్ట్ గా హాజరయ్యారు. హౌస్ మేట్స్ అందర్నీ కూడా నాగార్జున నాగచైతన్యకు పరిచయం చేశారు. తనుజాన్ని పరిచయం చేస్తూ ఒక లాంగ్ సీరియల్ ఉంది దాంట్లో ఎక్కువ ఏడవాలి హౌస్ లో కూడా అదే కంటిన్యూ చేస్తుంది అని తనుజను ఉద్దేశించి చెప్పారు నాగార్జున.
నాగార్జున అలా చెప్పిన వెంటనే తనుజ ఫీల్ అయింది. ఇకపై తనుజ ఎప్పుడు ఏడుస్తుందా అని ఆడియన్స్ చూసే లాగా ఉంటారు అంటూ నాగచైతన్య ముందు చెప్పింది. అలానే అలా ప్రామిస్ కూడా చేసింది. ఇకనైనా తనుజ ఏడవడం ఆపేసి, నటన ఆపేసి హౌస్ లో గేమ్ ఆడటం మొదలు పెడుతుందేమో చూడాలి.
ఇన్ని మాటలు మాట్లాడుతూ మరోవైపు నాకు హౌస్ లో ఎవరూ సపోర్ట్ కూడా లేరు అని కబుర్లు చెబుతూ ఉంటుంది. కానీ సపోర్ట్ లేకుండా ఒక గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు. బిగ్బాస్ యాజమాన్యం ఈమెకు సపోర్ట్ గా ఉంటున్నారు అని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే.
Also Read: Varanasi: వారణాసి సినిమా డ్యూరేషన్ ఇదే, అలాంటివి ఏమీ ఉండవు