Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ 9 చదరంగం కాదు రణరంగం అని ఈ షో మొదలైనప్పుడు నాగార్జున చెప్పారు. చెప్పిన మాదిరిగానే చాలా డిఫరెంట్ గా తొమ్మిదవ సీజన్ కొనసాగుతుంది. ఈ సీజన్ కి సంబంధించి ఆల్మోస్ట్ అందరూ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసారు. ఈవారం కెప్టెన్ గా భరణి ఎంపికయ్యారు. 13వ వారం హౌస్ నుంచి రీతు చౌదరి ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. రీతు చౌదరి ఎలిమినేట్ అయినప్పుడు హౌస్ లో చాలామంది విపరీతంగా బాధపడ్డారు.
అలానే రీతు చౌదరి హౌస్ నుంచి వెళ్ళిపోతూనే పవన్ ను బాగా చూసుకోండి అంటూ మరీ మరీ వెక్కివెక్కి ఏడుస్తూ చెప్పింది. ఇక పవన్ కూడా రీతూ చౌదరి వెళ్లిపోయినందుకు చాలా బాధపడ్డాడు. హౌస్ లో వీరిద్దరు బాండింగ్ ఎలా ఉండేదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేడు బిగ్ బాస్ హౌస్ లో మరోసారి రితోను తలుచుకుంటూ ఎవరు సపోర్ట్ లేరు అంటూ పవన్ బాధపడ్డాడు.
ఈరోజు బిగ్ బాస్ 0 నుంచి 2,50,000 వరకు కాస్ట్ ఉన్న కొన్ని బాక్సులను హౌస్ లో ఉంచారు. అయితే ఒక టాస్క్ లో బాల్ గెలిచిన తర్వాత ఆ 0 నుంచి 2 లక్షల 50 వేల వరకు ఎవరికైనా ఆ అమౌంట్ ఇవ్వచ్చు. అయితే ఆ అమౌంట్ ఎవరికైతే ఇస్తున్నారో వాళ్లు వర్త కాదా అని హౌస్ మేట్స్ అందరూ డిసైడ్ చేయాలి.
ఇక మొత్తానికి హైయెస్ట్ అమౌంట్ 250000 ఇమ్మానుయేల్ కళ్యాణ్ ఇచ్చాడు. దీనికి హౌస్ మేట్స్ అందరూ కూడా ఓకే చెప్పారు. భరణి రెండు లక్షల రూపాయలను తనుజాకు ఇచ్చారు. దీనికి కూడా అందరూ ఒకే చెప్పారు. స్వతహాగా తనుజ మాత్రం నేను రెండు లక్షల 50 వేలుకు కూడా అర్హురాలను అనేటట్లు తన వాదన చెప్పింది మొత్తానికి తను కూడా హ్యాపీ అని ఒప్పేసుకుందాం.
అయితే చివరకు సంజనా మరియు పవన్ మిగిలారు. హౌస్ లో 50,000 మరియు కేవలం జీరో మిగిలింది. ఖచ్చితంగా నీకు 50,000 వస్తుందో లే అని పవన్ కు ధైర్యం చెప్పింది సంజన. అయితే ఈ తరుణంలోనే పవన్ కెమెరా ముందుకు వచ్చి. చూసావా రీతు నాకు హౌస్ లో ఎవరు సపోర్ట్ చేయడం లేదు అంటూ వచ్చి బాధపడ్డాడు.
Also Read: Rajinikanth : నీలాంబరి పాత్రను మిస్ చేసుకున్న ఐశ్వర్యరాయ్, అసలు బ్యాక్ స్టోరీ ఏంటంటే?