Ritu Chaudhary : బిగ్ బాస్ సీజన్ 9 కు సంబంధించి ఇది చదరంగం కాదు రణరంగం అని నాగార్జున చెప్పినట్లు, అచ్చం అలానే జరుగుతుంది. ఈరోజు క్లోజ్ గా చూపించిన ఇద్దరు పర్సన్స్ ని రేపు అనే రోజు డిఫరెంట్ గా చూపిస్తున్నారు.
బిగ్ బాస్ సీజన్ 9 మొదలైనప్పుడు కళ్యాణ్ మరియు రీతి చౌదరి మధ్య ఒక లవ్ ట్రాక్ జరుగుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. వాళ్ల బంధం సజావుగా సాగుతుంది అనుకునే తరుణంలో నిన్న జరిగిన ఎపిసోడ్ లో వీరిద్దరి మధ్య బీభత్సమైన ఆర్గ్యుమెంట్ జరిగింది.
ఈ నాలుగువ వారం కెప్టెన్ గా రాము రాథోడ్ ఎంపికయ్యాడు. ఇమ్మానుయేల్, రీతు చౌదరి, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా కెప్టెన్ కి అర్హులు కారు అనే హౌస్ మేట్స్ డిసైడ్ చేసేసారు. ఈ తరుణంలో రీతూ చౌదరి కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోయింది.
నిన్న మొన్న లేని ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటూ విరుచుకు పడింది. కళ్యాణ్ ఒక సందర్భంలో నన్ను రీతు మోసం చేసింది అని హౌస్ మేట్స్ తో చెప్పడంతో,రీతు కంప్లీట్ గా ఫైర్ అయిపోయింది.
నిన్న మొన్న లేని ఫ్రెండ్షిప్ ఈరోజు కొత్తగా నీకు వచ్చిందా? అందరి ముందు నేను నిన్ను మోసం చేశాను అని చెప్పావు అంటూ రీతూ చౌదరి కళ్యాణ్ ను ప్రశ్నించింది. ఇప్పటివరకు నీతో బ్రతిమలాడుకున్నాను. కానీ అందరి ముందు నన్ను మోసం చేశాను అని నువ్వు చెప్పావు. దీనిని నేను ఎలాగ తీసుకోవాలి అంటూ ఫైర్ అయిపోయింది రీతు చౌదరి.
నేను నిన్ను అసలు ఏం మోసం చేశాను అంటూ ఫైర్ అయింది రీతు. నేను ఫ్రెండ్ అని నిన్ను భావించాను అంటే అందరి ముందు నా పరువు తగ్గించాల్సిన అవసరం నీకు లేదు అంటూ విరుచుకుపడింది రీతు చౌదరి.
Also Read: Bigg Boss 9: కెప్టెన్సీ కోసం వచ్చిన తిప్పలు, అందరూ కన్నీటి కొళాయిలు ఓపెన్ చేశారు