BigTV English
Advertisement

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ టైమ్ తగ్గింపు, ఇప్పటికే బుక్ చేసుకున్నవారి పరిస్థితి ఏంటి?

IRCTC Ticket Booking: రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ కు సంబంధించి భారతీయ  రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అడ్వాన్స్ రిజర్వేషన్ గడువును నెల రోజుల పాటు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ టైమ్ 120 రోజులు ఉండగా, ఇప్పుడు ఆ వ్యవధిని 60 రోజులకు కుదిస్తున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇందుకోసం రైల్వేశాఖ IRCTC నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.


ఇప్పటికే టికెట్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి?

ప్రస్తుతం రైలు ప్రయాణానికి మూడు నెలలు.. అంటే 120 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ సమయాన్ని రెండు నెలలలకు అంటే 60 రోజులకు తగ్గించింది రైల్వేశాఖ. ఈ నేపథ్యంలో ఇప్పటికే 120 రోజుల ముందుకు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకుల పరిస్థితి ఏంటి? అని చాలా మందిలో అనుమానం కలుగుతోంది. ఈ విషయంపై రైల్వే అధికారులు తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. వారి రిజర్వేషన్ ప్రకారమే బెర్తుల కేటాయింపు జరుగుతుందని తెలిపింది. నవంబర్ 1 నుంచి కొత్తగా తీసుకొచ్చిన నిబంధన అమలు అవుతుందని తెలిపింది. అంటే ఈనెల(అక్టోబర్) 31 వరకు టికెట్ బుక్ చేసుకునే వారికి 120 రోజుల నిబంధనే అమలు అవుతుందని తెలిపింది.


ఆ రైళ్లలో మార్పులు ఉండవు!

రైల్వేశాఖ తాజాగా తీసుకొచ్చిన నిబంధన కొన్ని రైళ్లకు వర్తించదని వెల్లడించింది. తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ లాంటి స్పెషల్ రైళ్లలో బుకింగ్ టైమ్ లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపింది. ఇప్పటికే ఈ రైళ్లలో బుకింగ్ టైమ్ తక్కువగా ఉందని తెలిపింది. అయితే, ఫారిన్ టూరిస్టులు ఏడాది ముందే ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ నిబంధనలో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించింది.

అప్పట్లో 60 రోజుల నుంచి 120 రోజులకు పెంపు

వాస్తవానికి అడ్వాన్స్ బుకింగ్ గడువు గతంలో 60 రోజులు ఉండేది. కానీ, కొద్ది సంవత్సరాల క్రితం 120 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ, ఇప్పుడు మళ్లీ పాత పద్దతినే కొనసాగించడం విశేషం.

రిజర్వేషన్ కష్టాలు తగ్గే అవకాశం

రైల్వేశాఖ తాజాగా తీసుకొచ్చిన 60 రోజుల అడ్వాన్స్ బుకింగ్ పద్దతి ద్వారా ప్రయాణీకులకు చాలా లాభాలు కలుగుతాయని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రయాణీకులకు టికెట్ రిజర్వేషన్ కష్టాలు తగ్గుతాయని తెలిపింది. ఎమర్జెన్సీ టికెట్స్ తోపాటు నెల రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకునే వారికి ఈ నిబంధన తో లాభం కలుగుతుందని తెలిపింది. అంతేకాదు, టికెట్ బుకింగ్ టైమ్ తగ్గించడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించవచ్చని భావిస్తున్నది. సాధారణ ప్రయాణీకులకు అడ్వాన్స్ బుకింగ్ మరింత అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

Read Also: కాశ్మీర్‌కు వందేభారత్ స్లీపర్ రైలు సిద్ధం.. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి, అబ్బో ఎన్ని ప్రత్యేకతలో చూడండి!

Related News

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా నిబంధనలతో కొత్త చిక్కులు.. కాలపరిమితి పెంపుపై చందాదారుల్లో అసంతృప్తి

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Big Stories

×