E-Paper
Advertisement

Flight Ticket: విమాన ప్రయాణికులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే టికెట్‌లో భారీ రాయితీ

Flight Ticket: విమాన ప్రయాణికులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే టికెట్‌లో భారీ రాయితీ
Advertisement

Flight Ticket: ప్రయాణం మన జీవితంలో తప్పనిసరి అయిపోయింది. ఎవరినైనా కలవడానికి, పనిమీద ప్రయాణం చేయడానికి, లేదా విహార యాత్ర కోసం అయినా.. విమాన ప్రయాణం తప్పనిసరిగా అవుతుంది. అయితే విమాన టికెట్ ధరలు పెరుగుతున్న కొద్దీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆ టికెట్‌పై డిస్కౌంట్ దొరికితే మనకెంత ఉపయోగం కదా! అలాంటి ప్రత్యేక ఆఫర్‌ను ఇప్పుడు ఎయిర్ ఇండియా అందిస్తోంది.

తక్కువ పాయింట్స్‌తో టికెట్లు బుక్

Advertisement

ఎయిర్ ఇండియా తాజాగా ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. ప్రయాణికులకు వచ్చిన అవార్డ్ పాయింట్ల‌పై 25 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. సాధారణంగా మనం ప్రయాణం చేసినప్పుడు వచ్చిన పాయింట్స్‌తో టికెట్ బుక్ చేయాలంటే ఎక్కువ పాయింట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ ద్వారా తక్కువ పాయింట్ల తోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా సుభవార్త చెప్పింది. ఉదాహరణకు మీరు నలభై వేల పాయింట్లతో బుక్ చేసే టికెట్‌ను ఇప్పుడు ముప్పై వేల పాయింట్లతోనే పొందవచ్చు అని ప్రకటించింది. ఈ తగ్గింపు ప్రయాణికులకు సౌకర్య వంతంగా మారింది..

ఆఫర్ ఎప్పటి వరకు?

Advertisement

ఈ ఆఫర్‌ను మొదట కొద్ది రోజులు మాత్రమే కొనసాగిస్తామని ఎయిర్ ఇండియా తెలిపిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు దాన్ని మరికొన్ని వారాలు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది. అంటే ప్రయాణికులకు ఇంకా నెల మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో ఎవరైనా తమ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకున్నా, లేకపోతే ఉద్యోగ పనుల కోసం విమానంలో ప్రయాణించాలనుకున్నా తక్కువ పాయింట్లతోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Also Read: Jio Offer: జియో అదిరిపోయే ప్లాన్.. ఏకంగా మూడు నెలలు వాలిడిటీ.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం!

ఎయిర్ ఇండియా స్టార్ అలయన్స్‌లో భాగమై ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ లైన్స్‌తో అనుబంధం కలిగి ఉంది. దీనివల్ల ప్రయాణం మధ్యలో ఆటంకాలు తలెత్తవు. అంతర్జాతీయంగా కూడా ఎక్క డికైనా వెళ్లాలన్నా ఈ తగ్గింపు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ఒకవైపు డాలర్ విలువ పెరిగి విదేశీ ప్రయాణాలు ఖరీదైనవిగా మారుతున్న వేళ, ఈ తగ్గింపు చాలా మందికి నిజమైన ఆదా అందిస్తుంది.

టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?

ఈ ఆఫర్ పొందడం కూడా చాలా సులభం. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోకి లేదా యాప్ లోకి వెళ్లి అవార్డ్ ఫ్లైట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు కావాల్సిన తేదీ, గమ్య స్థానం ఎంచుకుంటే తగ్గింపు ఆటోమేటిక్‌గా అమలులోకి వచ్చేస్తుంది. చాలా సులభమైన ప్రక్రియతో తక్కువ పాయింట్స్‌తో టికెట్లు మీ పేరుపై బుక్ అవుతాయి.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఉందండోయ్!

ఈ ఆఫర్ లో కొన్ని షరతులు ఉంటాయి. అన్ని రూట్స్ పై, అన్ని తేదీల్లో ఇది వర్తించక పోవచ్చు. కొన్ని ప్రత్యేక మార్గాల్లో మాత్రమే ఈ తగ్గింపు లభించవచ్చు. కాబట్టి ప్రయాణికులు ముందుగా వెబ్‌సైట్ లోని వివరాలను చెక్ చేసుకోవడం మంచిది. ఎయిర్ ఇండియా ఇచ్చిన ఈ కొత్త ఆఫర్ ప్రయాణికులకు ఒక బంగారు అవకాశం. తక్కువ మైల్స్‌తో ఎక్కువ ప్రయాణం చేసే అవకాశం కలిగే ఈ సమయాన్ని ఎవరూ వదులుకోవద్దు. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు ఉండనుంది కాబట్టి త్వరగా ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం డోంట్ మిస్ ఎయిర్ ఇండియా ఆఫర్.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×