E-Paper
Advertisement

Flight Ticket: విమాన ప్రయాణికులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే టికెట్‌లో భారీ రాయితీ

Flight Ticket: విమాన ప్రయాణికులకు సూపర్ ఛాన్స్.. ఇలా చేస్తే టికెట్‌లో భారీ రాయితీ
Advertisement

Flight Ticket: ప్రయాణం మన జీవితంలో తప్పనిసరి అయిపోయింది. ఎవరినైనా కలవడానికి, పనిమీద ప్రయాణం చేయడానికి, లేదా విహార యాత్ర కోసం అయినా.. విమాన ప్రయాణం తప్పనిసరిగా అవుతుంది. అయితే విమాన టికెట్ ధరలు పెరుగుతున్న కొద్దీ ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఆ టికెట్‌పై డిస్కౌంట్ దొరికితే మనకెంత ఉపయోగం కదా! అలాంటి ప్రత్యేక ఆఫర్‌ను ఇప్పుడు ఎయిర్ ఇండియా అందిస్తోంది.

తక్కువ పాయింట్స్‌తో టికెట్లు బుక్

Advertisement

ఎయిర్ ఇండియా తాజాగా ఒక ప్రత్యేక ప్రకటన చేసింది. ప్రయాణికులకు వచ్చిన అవార్డ్ పాయింట్ల‌పై 25 శాతం వరకు తగ్గింపును ప్రకటించింది. సాధారణంగా మనం ప్రయాణం చేసినప్పుడు వచ్చిన పాయింట్స్‌తో టికెట్ బుక్ చేయాలంటే ఎక్కువ పాయింట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఆఫర్ ద్వారా తక్కువ పాయింట్ల తోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఎయిర్ ఇండియా సుభవార్త చెప్పింది. ఉదాహరణకు మీరు నలభై వేల పాయింట్లతో బుక్ చేసే టికెట్‌ను ఇప్పుడు ముప్పై వేల పాయింట్లతోనే పొందవచ్చు అని ప్రకటించింది. ఈ తగ్గింపు ప్రయాణికులకు సౌకర్య వంతంగా మారింది..

ఆఫర్ ఎప్పటి వరకు?

Advertisement

ఈ ఆఫర్‌ను మొదట కొద్ది రోజులు మాత్రమే కొనసాగిస్తామని ఎయిర్ ఇండియా తెలిపిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు దాన్ని మరికొన్ని వారాలు పొడిగించింది. సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా తెలిపింది. అంటే ప్రయాణికులకు ఇంకా నెల మొత్తం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ కాలంలో ఎవరైనా తమ కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలనుకున్నా, లేకపోతే ఉద్యోగ పనుల కోసం విమానంలో ప్రయాణించాలనుకున్నా తక్కువ పాయింట్లతోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

Also Read: Jio Offer: జియో అదిరిపోయే ప్లాన్.. ఏకంగా మూడు నెలలు వాలిడిటీ.. జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితం!

ఎయిర్ ఇండియా స్టార్ అలయన్స్‌లో భాగమై ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్ లైన్స్‌తో అనుబంధం కలిగి ఉంది. దీనివల్ల ప్రయాణం మధ్యలో ఆటంకాలు తలెత్తవు. అంతర్జాతీయంగా కూడా ఎక్క డికైనా వెళ్లాలన్నా ఈ తగ్గింపు ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది. ఒకవైపు డాలర్ విలువ పెరిగి విదేశీ ప్రయాణాలు ఖరీదైనవిగా మారుతున్న వేళ, ఈ తగ్గింపు చాలా మందికి నిజమైన ఆదా అందిస్తుంది.

టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి?

ఈ ఆఫర్ పొందడం కూడా చాలా సులభం. ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లోకి లేదా యాప్ లోకి వెళ్లి అవార్డ్ ఫ్లైట్ బుకింగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీకు కావాల్సిన తేదీ, గమ్య స్థానం ఎంచుకుంటే తగ్గింపు ఆటోమేటిక్‌గా అమలులోకి వచ్చేస్తుంది. చాలా సులభమైన ప్రక్రియతో తక్కువ పాయింట్స్‌తో టికెట్లు మీ పేరుపై బుక్ అవుతాయి.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఉందండోయ్!

ఈ ఆఫర్ లో కొన్ని షరతులు ఉంటాయి. అన్ని రూట్స్ పై, అన్ని తేదీల్లో ఇది వర్తించక పోవచ్చు. కొన్ని ప్రత్యేక మార్గాల్లో మాత్రమే ఈ తగ్గింపు లభించవచ్చు. కాబట్టి ప్రయాణికులు ముందుగా వెబ్‌సైట్ లోని వివరాలను చెక్ చేసుకోవడం మంచిది. ఎయిర్ ఇండియా ఇచ్చిన ఈ కొత్త ఆఫర్ ప్రయాణికులకు ఒక బంగారు అవకాశం. తక్కువ మైల్స్‌తో ఎక్కువ ప్రయాణం చేసే అవకాశం కలిగే ఈ సమయాన్ని ఎవరూ వదులుకోవద్దు. సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఈ తగ్గింపు ఉండనుంది కాబట్టి త్వరగా ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవడం మంచిది. ఇంకెందుకు ఆలస్యం డోంట్ మిస్ ఎయిర్ ఇండియా ఆఫర్.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×