E-Paper
Advertisement

Air India Announcement: ‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్’..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్!

Air India Announcement: ‘మా కంపెనీకి జీతాలు పెరిగినయ్’..ఉద్యోగులకు ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్!

Air India Announces Annual Hikes and Performance Bonus: ఎయిర్ ఇండియా ఉద్యోగులకు ఆ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా గురువారం తన ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపును ప్రకటించింది. అలాగే పైలట్లకు వార్షిక పనితీరు బోనస్‌ను కూడా ప్రవేశపెట్టింది.

వార్షిక జీతాల పెంపు ఏప్రిల్ 1,2024 నుంచి అమలు కానున్నట్లు ఎయిర్ ఇండియా సీహెచ్‌ఆర్ఓ రవీంద్ర కుమార్ జీపీ ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్‌ ప్రకటిసున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో, ఎయిర్‌లైన్ వృద్ధి, పరివర్తనకు బలమైన పునాదులు వేయడంలో కీలక మైలురాళ్లను సాధించిందని CHRO రవీంద్ర కుమార్ తెలిపారు.

Vihaan.AI ప్రయాణంలో భాగంగా, ఎయిర్ ఇండియా సమకాలీన వార్షిక పనితీరు అంచనా ప్రక్రియ రైజ్‌ను ప్రవేశపెట్టిందని.. ఉద్యోగుల కోసం సరళీకృత, మార్కెట్-పోటీ, ఉత్పాదకత-ఆధారిత పరిహార నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని ఆయన అన్నారు. కాగా 2023లో, వారసత్వ ఉద్యోగులకు పరిహారం, ఒప్పంద పునర్నిర్మాణం మాత్రమే జరిగింది.

Also Read: Naga Chaitanya Buy Porsche: కోట్ల రూపాయల కారు కొన్న నాగ చైతన్య.. ఫీచర్లు ఇవే!

2022 చివరిలో ప్రకటించిన ఐదు సంవత్సరాల పరివర్తన ప్రణాళిక కింద ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ తనను తాను పునరుద్ధరించుకునే ప్రక్రియలో ఉంది. రెండేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థను టాటా గ్రూప్ టేకోవర్ చేసినప్పటి నుంచి ఎయిర్ ఇండియా సిబ్బందికి ఇది తొలి మదింపు ప్రక్రియ.

ఉద్యోగులలో పనితీరు-ఆధారిత, ప్రతిభ ఆధారిత గుర్తింపు సంస్కృతిని పెంపొందించడానికి పెద్ద ప్రయత్నాలలో భాగంగా ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ఎయిర్ ఇండియా వేతన పెంపులను అందజేస్తోందని ఒక నివేదిక పేర్కొంది.

కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ (Rise.AI) ఆధారంగా వార్షిక అంచనాలు, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ సిబ్బంది, పైలట్‌లతో సహా డిసెంబర్ 31, 2023కి ముందు చేరిన ఉద్యోగులందరికీ అందించింది కంపెనీ. ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో దాదాపు 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

Also Read: ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఊరట..విధుల్లో చేరిన సిబ్బంది

2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫిక్స్‌డ్ పే పెరగడంతో పాటు, కంపెనీ, వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఎయిర్‌లైన్ తన పైలట్‌లకు వార్షిక లక్ష్య పనితీరు బోనస్‌ను ప్రవేశపెట్టినట్లు నివేదిక పేర్కొంది.

టాటా గ్రూప్‌లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, AIX కనెక్ట్ (గతంలో ఎయిర్ ఏషియా ఇండియా), విస్తారా అనే నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి.

Tags

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×