BigTV English
Advertisement

Myntra Fraud: ఈ కామర్స్ కంపెనీ ‘మింత్రా’ భారీ మోసం.. కేసు నమోదు చేసిన ED

Myntra Fraud: ఈ కామర్స్ కంపెనీ ‘మింత్రా’ భారీ మోసం.. కేసు నమోదు చేసిన ED

విదేశీ ఈ కామర్స్ కంపెనీలు భారత ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇది. భారత్ లో కోట్లాదిమంది కస్టమర్లను కలిగి ఉన్న ఈ కామర్స్ దిగ్గజం మింత్రా చేసిన మోసం ఇది. అయితే ఈ కంపెనీ కస్టమర్లను ఎక్కడా మోసం చేయలేదు కానీ ప్రభుత్వాన్ని ఏమార్చింది. నిబంధనలు ఉల్లంఘించింది. అడ్డగోలుగా విదేశాలనుంచి 1,654 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో తెచ్చుకుంది. ఈ మోసంపై తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పందించింది. ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా-1999) ప్రకారం కేసు నమోదు చేసింది.


మోసం ఎలా జరిగింది..?
ఫెమా చట్టం ప్రకారం భారత్ లో రిటైల్ వ్యాపారాలు చేసేవారికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) సేకరించే విషయంలో కొన్ని నిబంధనలున్నాయి. అయితే హోల్ సేల్ వ్యాపారం చేసే వారికి మాత్రం FDIలపై వెసులుబాట్లు ఉన్నాయి. మింత్రా ఈ నిబంధనని చాలా తెలివిగా వాడుకుంది. ఫ్లిప్ కార్ట్ యాజమాన్యానికి చెందిన కంపెనీ మింత్రా. ఈ కంపెనీ భారత్ లో హోల్ సేల్ క్యాష్ & క్యారీ వ్యాపారం కోసం రిజిస్టర్ చేసుకుంది. అంటే వీళ్లు నేరుగా కస్టమర్లకు వస్తువుల్ని విక్రయించకూడదు. హోల్ సేల్ గా మాత్రమే విక్రయాలు జరపాలి. ఈ నిబంధనని పాటిస్తున్నట్టుగా ఇంతకాలం ప్రభుత్వాన్ని నమ్మించింది మింత్రా.

అంతా మోసం..
మనకు తెలిసినంత వరకు భారత్ లో మింత్రా డైరెక్ట్ గా కస్టమర్లకు వస్తువుల్ని విక్రయిస్తోంది. వాస్తవానికి ఆ కంపెనీ కస్టమర్లతో డీల్ పెట్టుకోకూడదు. హోల్ సేల్ వ్యాపారం మాత్రమే చేయాలి. అయితే ఇక్కడ మింత్ర ఓ తెలివైన పని చేసింది. వెక్టార్ ఈ కామర్స్ అనే సంస్థను తెరపైకి తెచ్చింది. ఈ సంస్థకు హోల్ సేల్ గా వస్తువుల్ని మింత్రా విక్రయిస్తుంది. సదరు వెక్టార్ ఈ కామర్స్ సంస్థ నేరుగా కస్టమర్లకు వాటిని విక్రయిస్తుంది. తాము వెక్టార్ ఈ కామర్స్ కి హోల్ సేల్ గా వస్తువుల్ని క్యాష్ అండ్ క్యారీ పద్ధతుల్లో విక్రయిస్తున్నాం కాబట్టి తాము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెచ్చుకున్నామంటోంది మింత్రా. కానీ ఇక్కడో చిన్న మతలబు ఉంది. వెక్టార్ ఈ కామర్స్ అనే సంస్థ కూడా మింత్రా యాజమాన్యానికి చెందినదే కావడం గమనార్హం.


నిబంధనల ఉల్లంఘన..
ఫెమా నిబంధనల ప్రకారం ఒకే యాజమాన్యంకి చెందిన సంస్థల మధ్య 25 శాతానికి మించి బిజినెస్ లావాదేవీలు జరగకూడదు. కానీ మింత్రా తన వ్యాపారాన్నంతా వెక్టార్ ఈ కామర్స్ ద్వారానే నిర్వహిస్తోంది. ఇది తీవ్రమైన ఉల్లంఘన. ఉల్లంఘనే కాదు.. మోసం కూడా. ఈ మోసం చేసిన మింత్రాపై ఇప్పుడు కేసు పెట్టింది ఈడీ. మొత్తంగా రూ. 1654 కోట్లు విదేశీలనుంచి ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సేకరించినట్టు తేలింది. అయితే తామింకా ఫిర్యాదు కాపీ అందుకోలేదని మింత్రా ఈ వ్యవహారాన్ని దాటవేస్తోంది. ఈడీకి పూర్తి సహకారం అందిస్తామని మాత్రం తెలిపింది.

ఏం జరుగుతుంది..?
నిబంధనల్లోని లొసుగుల్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏమార్చిన మింత్రా మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. ఇప్పటి వరకు సేకరించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఫెమా నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోంది. మింత్రాపై భారీ పెనాల్టీ విధించే అవకాశముందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ కేసు బయటకు రావడంతో మింత్రా కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతున్నట్టు తెలుస్తోంది.

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×