E-Paper
Advertisement

Myntra Fraud: ఈ కామర్స్ కంపెనీ ‘మింత్రా’ భారీ మోసం.. కేసు నమోదు చేసిన ED

Myntra Fraud: ఈ కామర్స్ కంపెనీ ‘మింత్రా’ భారీ మోసం.. కేసు నమోదు చేసిన ED
Advertisement

విదేశీ ఈ కామర్స్ కంపెనీలు భారత ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నాయనడానికి తాజా ఉదాహరణ ఇది. భారత్ లో కోట్లాదిమంది కస్టమర్లను కలిగి ఉన్న ఈ కామర్స్ దిగ్గజం మింత్రా చేసిన మోసం ఇది. అయితే ఈ కంపెనీ కస్టమర్లను ఎక్కడా మోసం చేయలేదు కానీ ప్రభుత్వాన్ని ఏమార్చింది. నిబంధనలు ఉల్లంఘించింది. అడ్డగోలుగా విదేశాలనుంచి 1,654 కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో తెచ్చుకుంది. ఈ మోసంపై తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ స్పందించింది. ఫారిన్ ఎక్స్ ఛేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ (ఫెమా-1999) ప్రకారం కేసు నమోదు చేసింది.

మోసం ఎలా జరిగింది..?
ఫెమా చట్టం ప్రకారం భారత్ లో రిటైల్ వ్యాపారాలు చేసేవారికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) సేకరించే విషయంలో కొన్ని నిబంధనలున్నాయి. అయితే హోల్ సేల్ వ్యాపారం చేసే వారికి మాత్రం FDIలపై వెసులుబాట్లు ఉన్నాయి. మింత్రా ఈ నిబంధనని చాలా తెలివిగా వాడుకుంది. ఫ్లిప్ కార్ట్ యాజమాన్యానికి చెందిన కంపెనీ మింత్రా. ఈ కంపెనీ భారత్ లో హోల్ సేల్ క్యాష్ & క్యారీ వ్యాపారం కోసం రిజిస్టర్ చేసుకుంది. అంటే వీళ్లు నేరుగా కస్టమర్లకు వస్తువుల్ని విక్రయించకూడదు. హోల్ సేల్ గా మాత్రమే విక్రయాలు జరపాలి. ఈ నిబంధనని పాటిస్తున్నట్టుగా ఇంతకాలం ప్రభుత్వాన్ని నమ్మించింది మింత్రా.

Advertisement

అంతా మోసం..
మనకు తెలిసినంత వరకు భారత్ లో మింత్రా డైరెక్ట్ గా కస్టమర్లకు వస్తువుల్ని విక్రయిస్తోంది. వాస్తవానికి ఆ కంపెనీ కస్టమర్లతో డీల్ పెట్టుకోకూడదు. హోల్ సేల్ వ్యాపారం మాత్రమే చేయాలి. అయితే ఇక్కడ మింత్ర ఓ తెలివైన పని చేసింది. వెక్టార్ ఈ కామర్స్ అనే సంస్థను తెరపైకి తెచ్చింది. ఈ సంస్థకు హోల్ సేల్ గా వస్తువుల్ని మింత్రా విక్రయిస్తుంది. సదరు వెక్టార్ ఈ కామర్స్ సంస్థ నేరుగా కస్టమర్లకు వాటిని విక్రయిస్తుంది. తాము వెక్టార్ ఈ కామర్స్ కి హోల్ సేల్ గా వస్తువుల్ని క్యాష్ అండ్ క్యారీ పద్ధతుల్లో విక్రయిస్తున్నాం కాబట్టి తాము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెచ్చుకున్నామంటోంది మింత్రా. కానీ ఇక్కడో చిన్న మతలబు ఉంది. వెక్టార్ ఈ కామర్స్ అనే సంస్థ కూడా మింత్రా యాజమాన్యానికి చెందినదే కావడం గమనార్హం.

నిబంధనల ఉల్లంఘన..
ఫెమా నిబంధనల ప్రకారం ఒకే యాజమాన్యంకి చెందిన సంస్థల మధ్య 25 శాతానికి మించి బిజినెస్ లావాదేవీలు జరగకూడదు. కానీ మింత్రా తన వ్యాపారాన్నంతా వెక్టార్ ఈ కామర్స్ ద్వారానే నిర్వహిస్తోంది. ఇది తీవ్రమైన ఉల్లంఘన. ఉల్లంఘనే కాదు.. మోసం కూడా. ఈ మోసం చేసిన మింత్రాపై ఇప్పుడు కేసు పెట్టింది ఈడీ. మొత్తంగా రూ. 1654 కోట్లు విదేశీలనుంచి ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో సేకరించినట్టు తేలింది. అయితే తామింకా ఫిర్యాదు కాపీ అందుకోలేదని మింత్రా ఈ వ్యవహారాన్ని దాటవేస్తోంది. ఈడీకి పూర్తి సహకారం అందిస్తామని మాత్రం తెలిపింది.

Advertisement

ఏం జరుగుతుంది..?
నిబంధనల్లోని లొసుగుల్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏమార్చిన మింత్రా మోసం ఎట్టకేలకు బట్టబయలైంది. ఇప్పటి వరకు సేకరించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ఫెమా నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోంది. మింత్రాపై భారీ పెనాల్టీ విధించే అవకాశముందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ కేసు బయటకు రావడంతో మింత్రా కార్యకలాపాలపై కూడా ప్రభావం పడుతున్నట్టు తెలుస్తోంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×