E-Paper
Advertisement

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే

Visakhapatnam: దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే
Advertisement

Visakhapatnam:  విశాఖ జిల్లా పెందుర్తిలో విషాద ఘటన చోటుచేసుకుంది. తన పై చిరాకు పడుతుందని అత్తను హత్య చేసింది ఓ కోడలు. పోలీసులు సమాచారం ప్రకారం.. అత్త కనకమహాలక్ష్మి, కోడలు లలితపై తరచూ చిరాకుపడుతుందనే కారణంతో.. అత్తను చంపటం కోసం దొంగ- పోలీస్ ఆటను ఎంచుకుంది. మనవరాలితో కలిసి దొంగ పోలీస్ ఆట ఆడాలని అత్తను ఓ కుర్చీలో తాళ్లతో కట్టి కళ్లకు గంతలు కట్టింది. అనంతరం అత్త పై పెట్రోల్ పోసి దేవుడి గదిలోని దీపం తీసుకొని వచ్చి అత్తపై విసిరింది. కుర్చీలో తాళ్లతో బంధించి ఉండటంతో ఆ మంటలలో అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కోడలు లలిత అగ్నిప్రమాదం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి వారి శైలిలో విచారణ చేపట్టగా కోడలే చంపిందని తేల్చారు.

Related News

లోకల్ వార్‌పై నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.. కూటమికి ‘స్థానిక’ షాక్ ఇచ్చిన జనసేన!

సెల్ఫీ ఆరాటం.. బారికేడ్లు బద్దలు.. భీమవరంలో జగన్‌కు తప్పిన పెద్ద ప్రమాదం!

జనతా పార్టీ నుండి వైసీపీ వరకు.. ముద్రగడ రియల్ స్టోరీ!

అన్నం తినేవాడెవడైనా అలా మాట్లాడతాడా? హరీష్‌రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్!

కౌరవ వంశాన్ని పాతాళానికి తొక్కుతాం.. కేసీఆర్ ఫ్యామిలీపై సీఎం రేవంత్ ఫైర్!

సినిమా సీన్‌ని తలపించేలా నవవధువు కిడ్నాప్.. వీడియో వైరల్!

కొడుకుతో అలా, కూతురితో ఇలా.. వైఎస్సార్ జయంతిలో విజయమ్మ రియాక్షన్..!

వయనాడ్‌లో కొండచరియల బీభత్సం.. సీసీటీవీ దృశ్యాలు!

Big Stories

Advertisement
×