E-Paper
Advertisement

బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐ.. కేంద్రం నోటిఫై.. ఎల్ఐసీలో మాత్రం!

బీమా కంపెనీల్లో 100 శాతం ఎఫ్డీఐ.. కేంద్రం నోటిఫై..  ఎల్ఐసీలో మాత్రం!
Advertisement

FDI In Insurance: ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఆటోమేటిక్ రూట్ కింద 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఈ విషయాన్ని నోటిఫై చేసింది. ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడులు 1938 నాటి బీమా చట్టం నిబంధనలకు అనుగుణంగా.. ఎఫ్‌డీఐని స్వీకరించే బీమా కంపెనీలు ఐఆర్డీఏఐ లైసెన్స్ లేదా అనుమతిని పొందాలనే షరతుకు లోబడి పనిచేయాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేక చట్టం కింద కొనసాగుతున్నందున.. దీంట్లో ఆటోమేటిక్ రూట్ కింద విదేశీ పెట్టుబడులు 20%కి పరిమితం చేసింది. LICలో విదేశీ పెట్టుబడి అనేది జీవిత బీమా కార్పొరేషన్ చట్టం, 1956 (31 ఆఫ్ 1956)లోని నిబంధనలు, జీవిత బీమా కార్పొరేషన్ చట్టం ఇతర నిబంధనలకు లోబడి పనిచేయాలి.

చట్ట సవరణలు

విదేశీ పెట్టుబడులున్న ఏ బీమా కంపెనీలోనైనా, బోర్డు ఛైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లలో కనీసం ఒకరైనా భారతీయ పౌరుడై ఉండాలని కూడా ఈ నిబంధనలు తెలుపుతున్నాయి. గతంలో ఫిబ్రవరిలో వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డీపీఐఐటీ బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నోటిఫై చేసింది. డిసెంబర్ 2025లో, పార్లమెంట్ ‘సబ్కా బీమా సబ్కీ రక్ష’ (బీమా చట్టాల సవరణ) బిల్లు 2025ను ఆమోదించింది. ఇది బీమా వ్యవస్థలో కీలక మార్పులను తీసుకొచ్చింది.

సరిహద్దు దేశాలు 10 శాతం

Advertisement

మూడు ప్రధాన చట్టాలైన 1938 బీమా చట్టం, 1956 జీవిత బీమా కార్పొరేషన్ చట్టం, 1999 బీమా నియంత్రణ అభివృద్ధి అథారిటీ చట్టాన్ని కేంద్రం సవరించింది. ఈ ఏడాది మార్చిలో భారత్ తో సరిహద్దులను పంచుకునే అన్ని దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. ఈ కొత్త మార్పుల తర్వాత, సరిహద్దు దేశాల నుంచి వచ్చే పెట్టుబడులలో 10% వరకు ఎలాంటి నియంత్రణ లేని పెట్టుబడుల వాటా పరిధిలోకి వస్తుంది. భారత్ సరిహద్దు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను నియంత్రించే ఫ్రేమ్‌వర్క్‌ కు కేబినెట్ సవరణలు చేసింది.

Related News

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

ఏఐ సునామీ.. ఐబీఎంకు ఊహించని షాక్! గంటల్లోనే రూ. 6.7 లక్షల కోట్లు మాయం!

నెలకు రూ.15,000 జీతం వచ్చే వారు కూడా లక్షాధికారి ఎలా అవ్వచ్చు? 50-30-20 రూల్ అంటే ఏంటి?

Big Stories

Advertisement
×