Kisan Vikas Patra Scheme: పెట్టుబడి అనగానే మొదటిగా ఆలోచించేది ఎంత రాబడి వస్తుందనే. మన పెట్టుబడికి తక్కువ టైంలో ఎక్కువ రాబడి వచ్చే పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. అది ఎఫ్డీ, SIP, గవర్నమెంట్స్ స్కీమ్.. ఏదైనా సరే కాస్త రాబడి ఎక్కువగా వచ్చే పథకాన్ని చూస్తుంటాం. మీ పెట్టుబడికి ఎలాంటి ఢోకా లేకుండా రూ.1000కి రెండు వేలు, రూ. లక్షకు రెండు లక్షలు వచ్చే అద్భుతమైన కేంద్ర ప్రభుత్వం పథకం ఒకటి ఉంది. అదే కిసాన్ వికాస్ పత్ర.
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లో కనీస పెట్టుబడి రూ.1000 కాగా, గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రస్తుతం 7.5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటును కేంద్రం సవరిస్తుంది. మీ డబ్బులు డబుల్ అవ్వాలంటే కచ్చితంగా 9 ఏళ్ల 7 నెలల పాటు పెట్టుబడిని కొనసాగించాలి.
1. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నెల నెలా పెట్టుబడికి అవకాశం లేదు. మీరు ఎంత మొత్తానైనా ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
2. 2.5 ఏళ్ల పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. మొదటి 2 సంవత్సరాల 6 నెలల పాటు డబ్బులు విత్ డ్రా చేయడానికి వీలు పడదు. ఆ తర్వాత అత్యవసరమైతే, కిసాన్ వికాస్ పత్ర క్యాన్సిల్ చేసి అసలు, వడ్డీ తీసుకోవచ్చు. మెచ్యూరిటీపై టీడీఎస్ కోత ఉండదు.
1. కిసాన్ వికాస్ పత్ర పై లోన్ తీసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్ ను బ్యాంకులో తాకట్టు పెట్టి సులభంగా లోన్ పొందవచ్చు.
2. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్ ఇది. మీ పెట్టుబడికి నూటికి నూరు శాతం గ్యారెంటీ ఉంటుంది.
3. మీ సమీపంలోని పోస్ట్ ఆఫీస్ లో చాలా సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చు.
4. నామినీ పేరు యాడ్ చేసుకుంటే.. మీకు ఏదైనా జరిగినా నామినీ మీ పెట్టుబడిని పొందవచ్చు.
Also Read: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 90% సబ్సిడీతో స్వయం ఉపాధి పథకాలు.. అప్లై చేసుకోండిలా!