E-Paper
Advertisement

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Microsoft: భూములపై మైక్రోసాఫ్ట్ దృష్టి.. పూణె, హైదరాబాద్ నగరాల్లో..

Microsoft: గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ భూములపై దృష్టి సారించిందా? ఈ మధ్యకాలంలో భూములను ఎందుకు కొనుగోలు చేస్తోంది? కేవలం మేజర్ సిటీలపై దృష్టి పెడుతోందా? ఇండియా తన వ్యాపారాన్ని భారీగా విస్తరించే ప్లాన్ చేస్తుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

గ్లోబల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తన సామ్రాజాన్ని విస్తరిస్తోంది. ఒకప్పుడు కొన్ని సిటీలకే పరిమితమైన ఈ కంపెనీ.. అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతోంది. ఇండియాలోని మేజర్ సిటీల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ముంబై, పూణె, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై సిటీల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. అంతేకాదు ఆయా నగరాల్లో డేటా సెంటర్లను విస్తరించే పనిలో పడింది. ఇందులో భాగంగా హైదరాబాద్, పూణె నగరాల్లో ఖరీదైన భూములను కొనుగోలు చేస్తోంది. ఇప్పటివరకు కేవలం ఒక్క పూణెలో 848 కోట్లతో భూములను కొనుగోలు చేసింది.

ఇందులో భాగంగా పూణెలోని హింజేవాడి ప్రాంతంలో 16.4 ఎకరాల ల్యాండ్‌ని కొనుగోలు చేసింది మైక్రోసాప్ట్. ఏకంగా 520 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇండో ఇన్పోటెక్ సిటీ నుంచి ఈ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ 31 కోట్ల పైచిలుకు కాగా, రిజిస్ట్రేషన్ ఫీజు 30 వేల రూపాయలు. అయితే ఈ ఒప్పందంపై మైక్రోసాప్ట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

ఈ ఏడాది ఆరంభంలో హైదరాబాద్‌లో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది ఆ కంపెనీ. ఇందుకోసం 267 కోట్ల రూపాయలు వెచ్చించింది. రంగారెడ్డి జిల్లా సాయి బాలాజీ డెవలపర్స్ నుంచి ఈ స్థలాన్ని కొన్నట్లు డేటా ఎనలిటికల్స్ సంస్థ తెలిపింది. ఈ ప్రాంతంలో డేటా సెంటర్‌ని అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.

ALSO READ:  హాట్ బాత్, విమానం తరహా సౌకర్యాలు.. ‘వందే భారత్’ స్లీపర్ ట్రైన్ ప్రత్యేకతలు తెలిస్తే ఔరా అంటారు!

రెండేళ్ల కిందట పూణెలోని పింప్రి-చించ్ వాడ్ ప్రాంతంలో 25 ఎకరాల భూములను కొనుగోలు చేసింది. దాని విలువ అక్షరాలా 328 కోట్లు రూపాయలు. 2025 నాటికి దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి ఏఐ, డిజిటల్ నైపుణ్యాలను అభివృద్ది చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మైక్రోసాప్ట్‌కు దేశవ్యాప్తంగా 23 వేల మంది ఉద్యోగులున్నారు.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×