E-Paper
Advertisement

BSNL Offer: రూ.107 నుంచే BSNL బడ్జెట్ ప్లాన్.. డేటా, కాల్స్, SMS అన్ని ఫ్రీ

BSNL Offer: రూ.107 నుంచే BSNL బడ్జెట్ ప్లాన్.. డేటా, కాల్స్, SMS అన్ని ఫ్రీ
Advertisement

BSNL Offer: బీఎస్ఎన్ఎల్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అంటే మనందరికీ తెలిసిన ప్రభుత్వ టెలికాం సంస్థ. ఈ సంస్థ ప్రైవేట్ కంపెనీల పోటీలో నిలబడటానికి తరచూ కొత్త కొత్త ఆఫర్లు విడుదల చేస్తూ కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు తాజాగా బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు తక్కువ ధరలో ఎక్కువ సదుపాయాలు లభిస్తున్నాయి.

తక్కువ రీచార్జ్.. ఎక్కువ బెనిఫిట్స్

Advertisement

బీఎస్ఎన్‌ఎల్ వినియోగదారులకు అందుబాటులో తీసుకువచ్చిన ప్లాన్ రూ.199. ఈ ప్లాన్ నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో దేశంలో ఎక్కడికైనా ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా మాట్లాడొచ్చు. రోజుకు 2జిబి వరకు డేటా వాడుకునే అవకాశం ఉంది. 2జిబి పూర్తయిన తర్వాత స్పీడ్ కొంచెం తగ్గినా కనెక్షన్ మాత్రం కొనసాగుతుంది. అదనంగా రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపే సౌకర్యం కూడా ఉంది. ఈప్లాన్‌ను మొత్తంగా చూస్తే ఒక్కసారి రీచార్జ్ చేస్తే నెలంతా నిశ్చింతగా నెట్‌ వాడుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు.

తగ్గేదే లే అంటున్న బీఎస్ఎన్ఎల్

Advertisement

ఇప్పుడు ప్రస్తుత మార్కెట్లో జియో, ఎయిర్‌టెల్, విఐ లాంటి సంస్థలు కూడా ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నాయి. అయినా, బీఎస్ఎన్ఎల్ మాత్రం తక్కువ ధరలో అదే సదుపాయాలను అందిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ బలంగా ఉండటంతో అక్కడి ప్రజలు ఈ సంస్థ సేవలపైనే ఆధారపడుతున్నారు. కేవలం రూ.199 ప్లాన్ మధ్య తరగతి వినియోగదారులకు సరైన ఆప్షన్‌గా నిలుస్తోంది. అంతేకాదు, రోజువారీ డేటా వినియోగం ఎక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రయోజనకరం.

Also Read: Jio vs Airtel: జియో వర్సెస్ ఎయిర్‌టెల్.. 84 రోజుల రీచార్జ్ ప్లాన్‌లో ఎవరు బెస్ట్?

బీఎస్ఎన్ఎల్ మరో ప్లాన్ ఇదే!

ఇంకా తక్కువ బడ్జెట్ ఉన్నవారికి బీఎస్ఎన్ఎల్ మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను అందిస్తోంది. రూ.107 ప్లాన్‌లో 35 రోజుల వాలిడిటీతో పాటు 200 నిమిషాల వాయిస్ కాలింగ్ సదుపాయం, అలాగే 3జిబి డేటా కూడా అందిస్తోంది. ఈ ప్లాన్ తక్కువగా నెట్‌ వాడే, కానీ మాట్లాడే అవసరం ఉన్నవారికి అనువుగా ఉంటుంది.

రోమింగ్ ఛార్జీలు తక్కువ

బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌ల ప్రత్యేకత ఏమిటంటే రోమింగ్ ఛార్జీలు తక్కువగా ఉండటం. ఎక్కడికైనా ప్రయాణం చేసినా టారిఫ్‌ మారదు. ప్రభుత్వ సంస్థ కావడం వలన నెట్‌వర్క్‌ స్టాబిలిటీ కూడా బాగుంటుంది. ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే తక్కువ ధరలో సేవలు అందించడం వల్ల చిన్న పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ పైనే ఆధారపడుతున్నారు.

ఇప్పటికే 4జి సేవలను

ఇక భవిష్యత్తులో బీఎస్ఎన్ఎల్ తన 4జి, 5జి సేవలను దేశవ్యాప్తంగా విస్తరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 4జి సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. త్వరలోనే దేశమంతా 4జి అందుబాటులోకి వస్తుందని సంస్థ ప్రకటించింది. అది ప్రారంభమైతే ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీగా మారే అవకాశం ఉంది. బడ్జెట్ ప్లాన్‌లు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతి ఒక్కరికి మంచి ఆప్షన్ బీఎస్ఎన్ఎల్‌లో లభిస్తోంది.

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×